Read more!

English | Telugu

నీది కడుపు కోత.. నాది గుండె కోత.. మనిద్దరికి ఈ శిక్ష తప్పదు! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -142లో.. మురారి తన గదిలో బాధపడుతుండగా కృష్ణ వస్తుంది. నేను నందు గురించి అలోచించి ఈ పని చేశాను.. పెద్దమ్మ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఇంకా ఎన్ని రోజులు మనల్ని ఇలా దూరం పెడుతారంటూ మురారి బాధపడతాడు.

మరొకవైపు మురారి గురించి ముకుంద ఆలోచిస్తుంటుంది. "పెద్ద అత్తయ్య వాళ్ళతో ఎవరు మాట్లాడవద్దని చెప్పింది.. దాంతో వాళ్లిద్దరూ ఉండడానికి ప్రైవసీ ఇచ్చినట్లయింది.. వాళ్ళిద్దరు దగ్గరయి మనసు మార్చుకుని కృష్ణ వెళ్ళకుండా మురారితోనే ఉంటానంటే.. నా పరిస్థితి ఏంటి" అని ముకుంద అనుకొని ఒక్కసారిగా నో అంటూ అరుస్తుంది. వెనకాల నుండి భవాని వచ్చి.. ఎందుకు అలా అరిచావని అంటుంది. కృష్ణ, మురారీలతో ఎవరు మాట్లాడొద్దని తప్పు చేశారు. మీరు మాత్రమే అలా ఆలోచిస్తున్నారని భవానీతో ముకుంద అంటుంది. ఆ తర్వాత రేవతి బట్టలు సర్దుతుండగా.. ఈశ్వర్ వచ్చి భోజనానికి ఏర్పాట్లు చేయమని అంటాడు. అలా చెప్పినా కూడా రేవతి తన మాట పట్టించుకోకుండా వెళ్తుంటే.. ఏంటీ ఏం వినపడనట్లు వెళ్తున్నావని అంటాడు. నా కొడుకు కోడలు తప్పు చేశారని అందరూ అలా బాధపెడుతున్నారు.. నేను నీతో మాట్లాడను.. అలా అయిన మీకు ఇష్టమైన వాళ్ళు మాట్లాడకుంటే ఎలా ఉంటుందో తెలుస్తుందని రేవతి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అందరూ భోజనం చేస్తుండగా.. కృష్ణ, మురారిలు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. ఇక వాళ్ళిద్దరు కూర్చోవడంతో భవాని పైకి లేస్తుంది.. తర్వాత అందరూ లేస్తారు. నాకు ఆకలిగా ఏం లేదు ఏసీపీ సర్.. అని కృష్ణ అనగానే.. నాకు ఆకలి ఇప్పుడే చచ్చిపోయిందని మురారి చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. రేవతి బాధపడుతూ  వెళ్లిపోతుంటే.. భవాని తనని అపి.. నీది కడుపు కోత, నాది గుండె కోత.. రెండు ఒకటే మనకు ఈ శిక్ష తప్పదని భవాని అంటుంది. "ముకుంద.. అందరూ భోజనం చేసాక మిగిలింది సెక్యూరిటీ గార్డ్ కి ఇవ్వు" అని  ముకుందతో భవాని అంటుంది.  దానికి ముకుంద సరేనని అంటుంది. మురారి అలా తినకుండా వెళ్ళేసరికి ముకుంద బాధపడుతుంది.

ఆ తర్వాత కాసేపటికి అందరూ భోజనం చేసి వెళ్ళిపోయాక.. కృష్ణ, మురారిలు భోజనం చెయ్యడానికి వస్తారు. మీకు లైఫ్ లాంగ్ గుర్తుండి పోయేలా..  మీకు డిన్నర్ నేను వడ్డీస్తానని కృష్ణ టేబుల్ పై ఉన్న బౌల్స్ ఓపెన్ చేసి చూసేసరికి.. అన్ని బౌల్స్ ఖాళీగా ఉంటాయి. ఆ తర్వాత మురారికి కృష్ణ వాటర్ ఇస్తుంది. కనీసం మంచినీళ్ళైనా ఉంచారని  ఇద్దరు బాధపడుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.