Read more!

English | Telugu

Krishna Mukunda Murari: లెటర్ ని చింపేసిన ముకుంద.. వాళ్ళిద్దరు భార్యాభర్తలుగానే ఉంటారన్న భవాని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -443 లో.. శ్రీనివాస్ తన ఇంటిని ఒక సేట్ కి అమ్ముతాడు.  ఆ సేట్ వచ్చి.. ఎందుకు అమ్ముతున్నారో తెలుసుకోవచ్చా అని శ్రీనివాస్ ని అడుగుతాడు. ఊరి చివర వేరే ఇల్లు కొన్నానని శ్రీనివాస్ అంటాడు. పాపం మీ కూతురు చనిపోయింది కదా ఆమెతో ఈ ఇంట్లో ఎన్నో జ్ఞాపకాలున్నాయి కదా అని సేట్ అనగానే.. మీరు ప్రతీసారీ చనిపోయిందని అనకండి అని కోప్పడతాడు శ్రీనివాస్.  నా కూతురే ఎక్కువ గుర్తొస్తుందని, అందుకే ఇల్లుని అమ్మేస్తున్నానని సేట్ తో శ్రీనివాస్ చెప్పేసి వెళ్లిపోతాడు.

ఆ తర్వాత మీరా అలియాస్ ముకుందకి శ్రీనివాస్ కాల్ చేయగా.. మీరా కట్ చేస్తుంటుంది. మళ్లీ మళ్లీ శ్రీనివాస్ చేయడంతో కాసేపటికి కాల్ లిఫ్ట్ చేసిన మీరా.. కాల్ కట్ చేస్తుంటే మళ్ళీ చేస్తావెందుకని మీరా కోప్పడుతుంది. ఇల్లు అమ్మేసానని శ్రీనివాస్ అనగానే.. సరే పెట్టేసేయ్ అని కాల్ కట్ చేస్తుంది మీరా. మరోవైపు కృష్ణకి మురారి కితకితలు పెడుతుండగా అలమరాలో ఉన్న లెటర్ పడిపోతుంది. అది చూసిన కృష్ణ సిగ్గుపడుతూ అదే విషయాన్ని రేవతితో చెప్పగా.. మీ శోభనానికి ముహుర్తం పెట్టిస్తానులే అని‌ కృష్ణతో రేవతి అంటుంది. ఆ తర్వాత ముకుంద వెళ్ళి ఆ లెటర్ చూసి.. నీకు బిడ్డ పుడితే నా పరిస్థితి ఏంటని ఆ లెటర్ ను చింపేస్తుంది‌. అప్పుడే అదర్శ్ చూసి.. ఎందుకు లెటర్ ని అంత కోపంగా చింపేస్తున్నావని అడుగుతాడు. కృష్ణ చేసిన పనులన్నింటిని ముకుంద నాకు లెటర్ లో రాసింది అది చదివిన క్షణం ముకుంద లేదనే భాదతో, కృష్ణ మీద కోపంతో చింపేసానని ముకుంద కవర్ చేస్తుంది.

ఇక కిచెన్ లో కృష్ణ వంట చేస్తుండగా.. రేవతి పిలుస్తుంది. ఎందుకని పిలుస్తున్నారు నేను వంట చేస్తున్నాగా అని కృష్ణ అనగానే..‌ నీ మొహం అని రేవతి అంటుంది. మీ అబ్బాయి, మీరు ఇద్దరు నన్ను.. నీ మొహమని ఎందుకంటారని రేవతిపై కృష్ణ కోపంగా అంటుంది. ఇక అప్పుడే సోఫాలోని భవానిని కృష్ణ చూసి ఆగిపోతుంది. కాసేపటికి మురారి, అదర్శ్, ముకుంద అక్కడికి వస్తారు. ఇక రేవతి అసలు విషయం భవానికి చెప్తుంది. కృష్ణ, మురారీలకి శోభనం ముహుర్తం పెట్టడానికి పంతులి గారిని పిలిపించాలా అక్కా అని రేవతి అనగానే.. ఏం వద్దు.. ముహుర్తం పెట్టిన ప్రతీసారీ ఏదో ఖ అడ్డంకి వస్తుంది.‌ ఇకనుండి వాళ్ళిద్దరు నిజమైన భార్యాభర్తలుగానే ఉంటారని భవాని అంటుంది. దాంతో ముకుంద షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.