Read more!

English | Telugu

Krishna Mukunda Murari : వారిద్దరికి మీరా చెక్ పెట్టనుందా.. భవాని అనుకున్నది నిజమవుతుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -458 లో.. కృష్ణ కడుపు నొప్పితో బాధపడటం.. ఇంటికి వచ్చాక కూడా ఏదో కోల్పోయినట్లు ఉండటం గమనించిన భవానీ.. అదే విషయాన్ని తలుచుకుని భాదపడుతుంది. అయితే భవాని దగ్గరికి రేవతి వచ్చి.. కృష్ణ, మురారీ హాస్పిటల్ కి వెళ్లారని అంటుంది. దాంతో భవానీ.. కృష్ణ నెలతప్పి ఉంటుంది రేవతి.. మనకు సర్ ప్రైజ్ ఇవ్వాలని మనకు ఇంకా చెప్పలేదేమో.. మనమే తనకు సర్ ప్రైజ్ చెయ్యాలంటు కృష్ణ పని చేసే ఆసుపత్రికి కాల్ చేస్తుంది.

కృష్ణ పని చేసే ఆసుపత్రికి భవాని కాల్ చేస్తుంది. మా కోడలు డాక్టర్ కృష్ణ వచ్చిందా ? మురారీ కూడా ఉన్నాడా అని అక్కడి రిసెప్షనిస్ట్ తో భవాని అనగానే.. ఇద్దరు వచ్చారు. ప్రెగ్నెన్సీ కోసం మాట్లాడటానికి వచ్చారని భవానీతో ఆ రిసెప్షనిస్ట్‌  చెప్తుంది. నిజంగానే కృష్ణ నెల తప్పింది కాబోలని భవాని అనుకుంటుంది. రేవతి, మధులకి అందరికి చెప్పేసి.. మురారీ కృష్ణ ఇంటికి వచ్చేలోపు పార్టీ ఏర్పాటు చెయ్యాలి. కొడుకులకు పెళ్లి చేసి ఇన్నేళ్ళైనా పిల్లలు పుట్టలేదని నా ఫ్రెండ్స్ సరస్వతి, సుచిత్రలు ఎన్ని మాటలన్నారు. వాళ్లని వెంటనే రమ్మంటాను పార్టీకి అని వాళ్లకి కాల్ చేసి ఆహ్వానిస్తుంది భవాని. మరోవైపు కృష్ణ, మురారీలు వీదేహీ దగ్గరకి వస్తారు. సరోగసి గురించి చెప్పగానే.. మీరు మరీ అంతగా రిక్వస్ట్ చేస్తున్నారు కాబట్టి.. అద్దెకు ఇవ్వాల్సిన వాళ్లు ఇంత త్వరగా దొరకదు కాబట్టి.. ఆల్రెడీ మీలానే ఒక జంట మమ్మల్ని కలిశారు. వాళ్లకు అద్దెగర్భం ఇచ్చే ఒక అమ్మాయి దొరికింది. తననే మీ బిడ్డను మోసేలా ఒప్పించగలిగితే మీ పని అయిపోతుంది. ఇదంతా రహస్యంగా జరగాలి కాబట్టి నేను మీకోసం ఆ మరో జంటతోనూ.. ఆ అద్దె గర్భం ఇచ్చే అమ్మాయితోనూ మాట్లాడతానంటూ మురారీ, కృష్ణలను వైదేహీ చెప్పగానే.. సరేనని సంతోషిస్తు కృష్ణ, మురారీ ఇంటికి వెళ్తారు. కాసేపటికి వైదేహి దగ్గరకు మీరా వెళ్తుంది.

వైదేహీతో మీరా ఓ ప్లాన్ చెప్తుంది. మరోవైపు ఇంట్లో పార్టీకి ఏర్పాట్లు చేస్తు మధు బిజీగా ఉంటాడు. అదేసమయంలో సుచిత్ర, సరస్వతీలు వస్తారు. సుచిత్ర, సరస్వతి తెగ మూతలు తిప్పేసుకుంటూ.. బిడ్డ పుట్టబోతుందని పార్టీలే ఇంత హడావుడి చేస్తున్నావంటే.. శ్రీమంతం, బారసాలకు ఇంకెంత చేస్తావో భవానీ నువ్వు అంటూ పొగిడేస్తారు. ఇక అప్పుడే మధు వచ్చి.. ఏంటి ఆంటీస్ వచ్చారా అని అంటాడు. మేము వచ్చాంలే కానీ.. మీ ఆవిడ అలేఖ్య పుట్టింటి నుంచి వచ్చిందా అని  సుచిత్ర అంటుంది. లేదు ఇంకా రాలేదని మధు అంటాడు. ఇంక రాదులే.. వదిలేసినట్లేనని సుచిత్ర అంటుంది. మీకు అస్సలు తగ్గలేదు ఆంటీలు అని మధు అనగా.. ఏంటదని సుచిత్ర అంటుంది. నోటి దూల అని మధు అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో ఇద్దరు రగిలిపోతారు. ఇక వచ్చినవారికి సంగీత జ్యూసులు ఇస్తుంటే.. తన వెనుకే మధు తిరుగుతుంటాడు. రజినీ మాత్రం రగిలిపోతూ.. ఇద్దరూ కలిసి ఉండద్దని తిట్టి మధుని పంపేస్తుంది. ఈ అత్తను లేకుండా చెయ్యాలని మధు తిట్టుకుంటూ వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.