Read more!

English | Telugu

స్వప్న ఎవరితో లేచిపోయిందో తెలుసుకున్న కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -76 లో.. గదిలోకి పడుకోవడానికి వచ్చిన స్వప్న "నేను బెడ్ మీద పడుకుంటే నువ్వెక్కడ పడుకుంటావు" అని అప్పుతో అనగా.. "లేచిపోయినదానివి.. నీకు ఈ గదిలో చోటివ్వడమే ఎక్కువ" అంటూ స్వప్నకి కౌంటర్ ఇస్తుంది అప్పు. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం.. కావ్య బొమ్మలకు రంగులు వేస్తుంటుంది. అప్పుడే కృష్ణమూర్తి వచ్చి.. రాత్రి నిద్రపోలేదా అమ్మ అని అనగానే.. లేదు నాన్న ఈ బొమ్మలకు రంగులన్నీ నేను వెయ్యకపోయుంటే.. ఇంకో పది రాత్రులు అయినా మీరు నిద్ర లేకుండా ఉండేవారని కావ్య అంటుంది. అయినా ఇది మీరు నేర్పిన విద్య నాన్న అని కావ్య అనగానే.. గురువుని మించిన శిష్యురాలు అయ్యావమ్మా అని కృష్ణమూర్తి అంటాడు‌. రాత్రి జరిగిన గొడవకి అల్లుడు గారు నిన్ను దోషిగా మాత్రం చూడలేదు కదా అని కృష్ణమూర్తి అనగానే.. చూసాడు కాని దోషిగా ఉండడానికి నేను ఒప్పుకోను కదా నాన్న అని కావ్య అంటుంది. ఈ రంగులు దిద్దినట్లు నీ కాపురాన్ని కూడా చక్కదిద్దుకోమ్మా అని కృష్ణమూర్తి చెప్తాడు.

మరోవైపు రాహుల్ తో రాజ్ ఫోన్ మాట్లాడతాడు. ఈ ఇంట్లో అందరూ మోసగాళ్ళే అని రాజ్ అంటాడు. రాత్రి స్వప్న ఇంటికి వచ్చిందని రాజ్ చెప్పగానే.. రాహుల్ స్వప్న అక్కడికి ఎందుకు వెళ్ళిందని షాక్ అవుతాడు. ఏమైనా చెప్పిందా అని రాహుల్ అడుగుతాడు. ఒక్కొక్కరు ఒక్కో లాగా మాట్లాడుతున్నారు. ఆ స్వప్న ని బయటకు పంపించేసింది కావ్యేనని.. నువ్వు చెప్పిందే నిజమని రాజ్ అంటాడు. మరి కావ్యని అక్కడ వదిలేసి వస్తున్నావా అని రాహుల్ అడుగుతాడు. లేదు తీసుకువస్తున్నాను.. దానికి వేరే కారణం ఉందిలే వచ్చాక చెప్తానని రాజ్ అంటాడు. ఆ తింగరిది స్వప్న ఏం చెప్పిందో ఏమోనని రాహుల్ టెన్షన్ పడుతాడు. ఇంతలో రాజ్ మీతో మాట్లాడాలని స్వప్న వస్తుంది. ఏం మాట్లాడాలని కోప్పడతాడు రాజ్.  నేనేం చెయ్యలేదు.. నేను వెళ్లిపోతే మీ పెళ్లి ఆగుతుందని అనుకున్న కానీ కావ్య మిమ్మల్ని కావాలని పెళ్లి చేసుకుందని అంటుంది. మీ చెల్లి గురించి నువ్వు మాట్లాడకు.. తను నేను చూసుకుంటాం.. ఎవరు ఇదంతా చేశారో తేలుస్తానని రాజ్ అంటాడు. ఆ తర్వాత స్వప్న ఫోన్ కి రాహుల్ ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ కాస్త కావ్య లిఫ్ట్ చేస్తుంది. కావ్య వాయిస్ వినకుండానే.. నువ్వు మీ ఇంటికి ఎందుకు వెళ్ళావ్? లేచిపోయింది నాతో అని చెప్పావా అని ఆవేశపడుతాడు. అప్పుడు స్వప్నని ట్రాప్ చేసింది రాహుల్ అని కావ్యకి అర్థమవుతుంది. ఇద్దరిని ఎలాగైనా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని రాజ్ కి చూపించాలని కావ్య అనుకుంటుంది. రాజ్, కావ్య ఇద్దరు బయలుదేరతారు. స్వప్న ఫోన్ కావ్య దగ్గర ఉండేసరికి స్వప్న టెన్షన్ పడుతు తీసుకుంటుంది. ఇక రాజ్, కావ్యలు వెళ్ళిపోతారు.

మరోవైపు కావ్య, రాజ్ లను గుమ్మం దగ్గరే ఆపేస్తుంది అపర్ణ. ఆ అమ్మాయిని తీసుకొని వస్తే నువ్వు కూడా ఇంట్లోకి రాకని రాజ్ తో అంటుంది అపర్ణ. నీకు దెబ్బ తాకినప్పుడు ఇష్టం లేని ఇల్లు అయినా కూడా అపర్ణ వచ్చింది కానీ నువ్వు రానని ఆమెను బాధపెట్టావని.. దానికి సరైన వివరణ ఇచ్చి ఉంటే నీ తల్లి ఇంత బాధపడి ఉండేది కాదని రాజ్ వాళ్ళ నానమ్మ ఇందిరాదేవి అంటుంది. దానికి సరైన కారణం ఉంది నాన్నమ్మ.. నేను ఇప్పుడు చెప్పలేనని రాజ్ అంటాడు. నేను ఏ తప్పు చేశాను.. నన్ను దోషిలాగా ఇక్కడ నిలబెట్టారు.. నేను ఏ తప్పు చెయ్యకుండా పుట్టింటికి వెళ్ళాలి.. మీరే చెప్పండని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.