English | Telugu

Karthika Deepam 2: కార్తీక్ కి నిజం చెప్పేసిన కాశీ.. జ్యోత్స్న షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -553 లో.... జ్యోత్స్న గదిలోకి దీప వెళ్ళిందని పారిజాతం చెప్పగానే జ్యోత్స్నకి భయం వేసి తన గదిలోకి వెళ్తుంది. కానీ జ్యోత్స్న వచ్చేలోపే దీప వెళ్లి తన రూమ్ లో రికార్డర్ పెట్టి వెళ్తుంది. జ్యోత్స్న వచ్చి ఎవరు లేరు కదా.. బావ మాటల్లో ఏదో తేడా కనపడింది.. ఇదంతా ఏంటి.. నా గురించి బావకి తెలిసిందా అని జ్యోత్స్న భయంతో వైరాకి కాల్ చేస్తుంది. అప్పుడే ఫోన్ రికార్డింగ్ కనిపిస్తుంది. అది చూసి షాక్ అవుతుంది. వెంటనే ఫోన్ కట్ చేస్తుంది.

వైరా మళ్ళీ తిరిగి కాల్ చేస్తాడు. అప్పుడు జ్యోత్స్న రికార్డింగ్ అవుతున్న విషయం గమనించి వైరా ఎవరో తెలియనట్లుగా మాట్లాడుతుంది. మీరు నాకు ఎందుకు కాల్ చేశారు.. నేను ఇప్పుడు సీఈఓగా లేకపోవచ్చు కానీ ఎప్పుడు రెస్టారెంట్ ని పైనే ఉంచుతానని మాట్లాడుతుంది. ఆ మాటలకి వైరా షాక్ అవుతాడు. ఇలా హ్యాండ్ ఇచ్చింది ఏంటని అనుకుంటాడు.

ఆ తర్వాత దీప వెళ్లి ఫోన్ తీసుకొని బయటకు వస్తుంటే.. ఏంటి నా గదిలో నుండి వస్తున్నావని జ్యోత్స్న ఏం తెలియనట్లే మాట్లాడుతుంది. దీప అక్కడ నుండి వెళ్లి కార్తీక్ కి ఫోన్ ఇస్తుంది. ఇదంతా జ్యోత్స్న ఫోన్ రికార్డింగ్ చూసి మాట్లాడినట్లు అనిపిస్తుందని కార్తీక్ కి డౌట్ వస్తుంది.

ఆ తర్వాత కాశీ దగ్గరికి కార్తీక్ వెళ్లి ఒక మనిషి దగ్గరికి వెళ్ళాలి. తన పేరు వైరా అని కార్తీక్ అనగానే కాశీ భయపడుతాడు. కార్తీక్ తన చెంపచెల్లుమనిపిస్తాడు. ఇదంతా మా నాన్నపై కోపంతో చేసావ్.. ఇలా చెయ్యమని ఆఫర్ ఇచ్చింది జ్యోత్స్న కదా అని అనగానే అవునని కాశీ అంటాడు. నన్నేం చేయమంటావ్ నన్ను మనిషిగా కూడా మీరు ఎవరు చూడడం లేదని కాశీ అంటాడు. ఇప్పుడు మనం ఆ వైరా దగ్గరికి వెళ్ళాలని కార్తీక్ తనని తీసుకొని వెళ్తాడు.

మరొకవైపు దశరత్, సుమిత్ర గురించి బాధపడుతుంటే అమ్మగారికి ఏం కాదని దీప దైర్యం చెప్తుంటే ఒక క్షణం జ్యోత్స్న వచ్చిందనుకుంటాడు. నువ్వు నా కూతురు అయితే ఎంత బాగుండు అని దీపతో దశరథ్ అనగానే నేను మీ కూతురునే నాన్న అని తన మనసులో దీప అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.