English | Telugu

Karthika Deepam 2: అత్త గురించి కార్తీక్ టెన్షన్.. రిపోర్ట్స్ లో ఏముంది..?

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -550 లో... కావేరి, స్వప్న ఇద్దరు శ్రీధర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడని బాధపడుతారు. కాసేపటికి కాంచనకి కావేరి ఫోన్ చేసి మాట్లాడుతుంది. నువ్వు ఏం టెన్షన్ పడకని కాంచన చెప్తుంది. నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్ళావా అక్క అని కావేరి అనగానే.. అంటే నేను వెళ్లాలని అనుకుంటున్నావా అని కాంచన అంటుంది. అంటే ఆయనకి నా కన్నా మీరే ఎక్కువ ఇష్టమని కావేరి అంటుంది. కావేరి మాటలు కాంచనని బాధపెడుతాయి. ఆ తర్వాత ఎందుకు అమ్మ పెద్దమ్మతో అలా మాట్లాడావని స్వప్న అంటుంది.

మరొకవైపు డాక్టర్ సుమిత్ర గురించి పాజిటివ్ గా చెప్పారు.. రెండు రోజుల్లో రిపోర్ట్స్ వస్తాయని చెప్పారు.. వెళ్లి సుమిత్రకి ఏం కావాలో చూడమని దీపతో దశరథ్ చెప్పగానే దీప వెళ్తుంది. నాకు మా నాన్న కన్నా అత్తకి ఏమైందోనన్న టెన్షన్ ఎక్కువగా ఉందని కార్తీక్ అంటాడు. నిజం చెప్పండి మావయ్య అని దశరథ్ ని కార్తీక్ అడుగుతాడు. దాంతో నాకు భయంగానే ఉంది.. రిపోర్ట్స్ వస్తే చెప్తానన్నాడు మేజర్ ప్రాబ్లమ్ అయి ఉంటుందన్నాడని దశరథ్ చెప్తాడు. ఈ విషయం దీపకి తెలియొద్దు అనుకుంటారు. కార్తీక్ బయటకు వస్తుంటే దీప వింటుంది. నేను అంతా విన్నాను బావ అని అనగానే అత్తకి ఏం కాదని దీపకి ధైర్యం చెప్తాడు కార్తీక్.

మరొకవైపు శౌర్య దగ్గరికి కాంచన వస్తుంది. మీ తాత స్టేషన్ లో ఉన్నాడు.. మీ నాన్న వస్తే వెళ్ళాలి అనుకుంటున్నానని చెప్తుంది. అప్పుడే కార్తీక్, దీప వస్తారు. దీప క్యారేజ్ రెడీ చెయ్ మీ మావయ్య గారికి తీసుకొని వెళ్ళాలని కాంచన అంటుంది. ఆ తర్వాత కాంచనని తీసుకొని స్టేషన్ కి వెళ్తాడు కార్తీక్. కాంచన రావడంతో శ్రీధర్ హ్యాపీగా భోజనం చేస్తాడు. అమ్మనాన్న మాట్లాడుకుంటారు. మధ్యలో నేను ఎందుకని కార్తీక్ బయటకు వెళ్తాడు. నన్ను భర్తగా ఒప్పుకొని.. నా కోసం వచ్చావని శ్రీధర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను అంగీకరించానని మీకెవరు చెప్పారని కాంచన అనగానే శ్రీధర్ షాక్ అవుతాడు. భోజనం తినడం ఆపేస్తాడు. కార్తీక్ అది విని లోపలికి వస్తాడు. కార్తీక్ వచ్చి భోజనం తినిపిస్తుంటే వద్దని అంటాడు. అమ్మ, మీరు ఎప్పటిలాగే ఉండొచ్చు కదా అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.