English | Telugu

Karthika Deepam 2: కాశీ వర్సెస్ స్వప్న.. వాళ్ళ నాన్న తప్పు చేయలేదని కార్తీక్ నిరూపిస్తాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -549 లో... నాన్న తప్పు చేశారంటే ఇక్కడ ఎవరు నమ్మరని కార్తీక్ కాన్ఫిడెంట్ గా చెప్తాడు. అది విని.. తాత నువ్వు మావయ్య తప్పు చెయ్యలేదని నమ్ముతున్నావా అని జ్యోత్స్న అడుగుతుంది. లేదని శివన్నారాయణ అంటాడు. అలాగని తప్పు చేసాడని అనుకోవడం లేదు.. ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నానని శివన్నారాయణ అంటాడు.

మరొకవైపు కాశీ ఇంటికి వస్తాడు. ఇంట్లో నుండి వెళ్ళిపో మీ మావయ్య గురించి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా అని కావేరి తనపై కోప్పడుతుంది. నేను చేసింది కరెక్ట్ అందుకే ఆయన సైలెంట్ గా పోలీస్ లతో వెళ్ళిపోయాడని కాశీ అంటాడు. అయిన ఇప్పుడు ఆ జాబ్ కి రాజీనామా చేసాను. ఇంట్లో నుండి వెళ్ళమంటే చెప్పండి వెళ్ళిపోతానని కాశీ అనగానే.. నువ్వు ఉండాలి కాశీ.. మా డాడీ ఏ తప్పు చెయ్యలేదని నువ్వు వినాలని స్వప్న అంటుంది.

ఆ తర్వాత సుమిత్ర అమ్మ ఏమైనా ఫోన్ చేసిందా అని జ్యోత్స్నని దీప అడుగుతుంది. ఎందుకు మా అమ్మ గురించి అంత టెన్షన్ అని అప్పుడు కూడా దీపతో కోపంగా మాట్లాడుతుంది జ్యోత్స్న.

మరొకవైపు సుమిత్రకి టెస్ట్ చేసి డాక్టర్ లోపలికి రమ్మని దశరథ్ ని పిలుస్తాడు. తనతో పాటు సుమిత్ర కూడ లోపలకి వెళ్తుంది. మీరు రెండు రోజులు హాస్పిటల్ లో అడ్మిట్ కావాలని డాక్టర్ సుమిత్ర గురించి అనగానే నాకేం అయింది.. ఏం కాలేదు పదండి అని సుమిత్ర బయటకు వెళ్లిపోతుంది. ఏమైంది డాక్టర్ అని దశరథ్ డాక్టర్ ని అడుగుతాడు. తనకి మేజర్ ప్రాబ్లమ్ ఉన్నట్లు అనిపిస్తుంది. టెస్ట్ లకు పంపించాం.. ఆ రిపోర్ట్స్ తో పెద్ద డాక్టర్ వస్తాడు.. రిపోర్ట్స్ వచ్చాక కాల్ చేస్తామని డాక్టర్ చెప్తాడు.

ఆ తర్వాత సుమిత్ర, దశరథ్ ఇంటికి వెళ్తారు. దీప ఎదురుగా వచ్చి ఏమైంది అమ్మ అని అడుగుతుంటే.. పనిమనిషివి అమ్మగారు అనాలని పారిజాతం అంటుంది. ఆ తర్వాత రెస్టారెంట్ విషయంలో జరిగింది మొత్తం దశరథ్ కి శివన్నారాయణ చెప్తాడు. నా తండ్రి ఏ తప్పు చెయ్యలేదని నిరూపిస్తానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.