English | Telugu

Karthika Deepam2 : కావేరికి పిలిచే ఛాన్స్ కూడా ఇవ్వని కాంచన.. కార్తీక్ ఆన్ ఫైర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -539 లో..... శౌర్య హోమ్ వర్క్ చెయ్యకుండా అల్లరి చేస్తుంది. దాంతో అనసూయ కోప్పడుతుంది. శౌర్య హోమ్ వర్క్ చెయ్యకుండా కాంచన బొమ్మ డ్రాయింగ్ వేస్తుంది. అది అనసూయ చూసి ఇది రాయకుండా ఏం చేస్తుందని శౌర్య వెంట అనసూయ పరుగెడుతుంది. అప్పుడే కార్తీక్, దీప వస్తారు. అంతలోనే కావేరి వస్తుంది. ఏంటి చిన్నమ్మ ఇలా వచ్చావని కార్తీక్ అడుగుతాడు.

దీప ప్రెగ్నెంట్ కదా అత్తయ్యగా తనకి ఇష్టమైనవి వండి పెట్టాలని కావేరి అంటుంది. అందుకే రేపు ప్రొద్దున మా ఇంటికి టిఫిన్ కి పిలుద్దామని వచ్చానంటూ కావేరి అంటుంది. కాంచనని కూడా పిలవబోతుంటే.. కార్తీక్, దీప వస్తారని కాంచన అంటుంది. సరే అని కావేరి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరొకవైపు కాశీ ఇంటికి రాగానే శ్రీధర్ గొడవ పెట్టుకుంటాడు. దాంతో స్వప్న, కాశీ కూడా గొడవపెట్టుకుంటారు. నువ్వు ఒక అసమర్ధత గలవాడివి అని స్వప్న అనగానే కాశీకి కోపం వస్తుంది. అప్పుడే కావేరి వచ్చి.. ఏంటి మీ గొడవ అని కోప్పడుతుంది. నీ భర్తని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోమని కావేరి అనగానే.. వాళ్ళేదో అంటే నువ్వు ఏదో అంటావేంటి స్వప్న మీరు ఇద్దరు లోపలికి వెళ్ళండి అని శ్రీధర్ అంటాడు. నువ్వు వెళ్లిన పని ఏమైందని శ్రీధర్ అడుగగా అక్క తనని పిలిచే అవకాశం ఇవ్వలేదని కావేరి చెప్తుంది.

మరొకవైపు మనతో పాటు అమ్మని కూడా రేపు అక్కడికి తీసుకొని వెళదామని దీపతో కార్తీక్ అంటాడు. అదే విషయం కాంచనతో చెప్పగా రానని అంటుంది. శౌర్య వచ్చి.. తాతయ్య ఇంటికి నానమ్మ భోజనానికి ఎందుకు రావాలని అడుగుతుంది. అలాంటప్పుడు తాతయ్య దగ్గర నానమ్మని వదిలేసి రావాలని శౌర్య అనగానే శౌర్యపై కాంచన కోప్పడుతుంది. నేను మీకు ఏం అడ్డుంటున్నాను.. అన్నీ తల్లి నేర్పిస్తే పిల్ల మాట్లాడుతుందని కాంచన అనగానే దీప తన కాళ్లపై పడుతుంది. అత్తయ్య నేనేం చెప్పలేదని దీప ఏడుస్తుంది. ఆ తర్వాత కార్తీక్ అత్తా కోడళ్ళపై కోప్పడతాడు. నువ్వు రేపు వస్తున్నావా లేదా అని కార్తీక్ అడుగగా.. రానని కాంచన చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.