Read more!

English | Telugu

ఉగాది పందెంలో దీప గెలుపు.. జ్యోత్స్నకి పెళ్ళి యోగం లేదంట!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -18 లో.. ఉత్తమ ఉగాది పచ్చడి పోటీలో ఎవరైతే పచ్చడి బాగా చేస్తారో, వాళ్ళకి ఈ గోల్డ్ చైన్ అని శివనారాయణ చెప్పడంతో ఒక్కొక్కరుగా ఉగాది పచ్చడి చెయ్యడం మొదలెడతారు. సుమిత్ర, శౌర్య ఒక జట్టుగా ఉంటారు. కార్తీక్ మరియు తన తల్లి ఒక జట్టుగా ఉంటారు. పారిజాతం మరియు జ్యోత్స్న ఇద్దరు ఒక్కొక్క జట్టుగా ఉంటారు.

అ తర్వాత కాంచన తన కొడుకు కార్తీక్ తో... ఈ సంవత్సరమైనా పెళ్లి చేసుకోరా అని చెప్తుంటే కార్తీక్ మాత్రం డైవర్ట్ చేస్తాడు. ఆ  తర్వాత జ్యోత్స్న పచ్చడిలో ఎంత కారం వెయ్యాలని అడుగుతుంది. మూడు స్ఫూన్ లు అని పారిజాతం చెప్తుంది. అందరు తాము చేసిన పచ్చడిని తీసుకొని వస్తారు. ఒకొక్కరిగా చేసిన పచ్చడిని రుచి చూసి విన్నర్ ని అనౌన్స్ చెయ్ అని దీపతో శివనారాయణ  చెప్తాడు. మొదటగా జ్యోత్స్న చేసిన పచ్చడి రుచి చూసిన దీప కారంగా ఉందని చెప్తుంది. అ తర్వాత కార్తీక్ చేసిన పచ్చడి చూసి చేదుగా ఉందని చెప్తుంది. ఆ తర్వాత పారిజాతం చేసిన పచ్చడి చూసి ఇది ఎలాగో ఉందని చెప్పగా.. టేస్ట్ కోసం ఇంగువ వేసానని పారిజాతం చెప్తుంది. అ తర్వాత శౌర్య, సుమిత్రలు చేసిన పచ్చడి టేస్ట్ చేసి ఉప్పు ఎక్కువ అయిందని చెప్తుంది.

అ తర్వాత ఎవరు పచ్చడి బాగా చేయలేదు.. ఉత్తమ ఉగాది పచ్చడి గిఫ్ట్ చైన్ ని ఎవరు గెల్చుకోలేదు. దీప నువు వెళ్లి అందరికి నీ చేత్తో పచ్చడి చేసి ఇవ్వమని శివనారాయాణ చెప్తాడు. అప్పుడే పంతులు గారు హారతి తీసుకొని వస్తాడు. ఆ తర్వాత దీప ఉగాది పచ్చడి చేసి తీసుకొని వస్తుంది. అందరు బాగుందంటు మెచ్చుకుంటారు. ఈ గిఫ్ట్ దీప గెల్చుకుందని చైన్ ని శౌర్య మెడలో వేస్తాడు  శివనారాయణ.  ఆ తర్వాత జ్యోత్స్న పేరు మీద రాశిఫలాలు చూస్తాడు. ఈ సంవత్సరం పెళ్లి యోగం లేదని పంతులు చెప్తాడు. అ తర్వాత కార్తీక్ రాశిఫలాలు చూసి మంచి చెయ్యబోతే చెడు ఎదరయినట్టు ఉంటుందని కార్తీక్ గురించి చెప్తాడు. అ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.