Read more!

English | Telugu

ఆఫీస్ లో మొదటిరోజే సత్తాచాటిన రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ ఎపిసోడ్ -14 లోకి అడుగుపెట్టింది. కాగా బుధవారం నాటి ఎపిసోడ్ లో.. స్వప్నని ఇంప్రెస్ చేయాలని అదేపనిగా పొగిడేస్తుంటాడు రాహుల్. ఇక స్వప్న ఇంటికి వెళ్తాను అని చెప్పగా.. "మీకు అభ్యంతరం లేకపోతే నా కార్ లో తీసుకెళ్తాను. మీలాంటి సౌందర్య దేవతని ఆరాధించే అవకాశం కల్పించండి" అని అనగా సరేనని చెప్తుంది. ఇక రాహుల్ తన కార్ లో వెళ్తున్నంత సేపు ఏదో ఒక ప్రశ్న అడిగి స్వప్నని ఇబ్బంది పెడతాడు. ఇక స్వప్న తన ఇంటికి తీసుకెళ్తే ఎక్కడ దొరికిపోతానో అని టెన్షన్ పడుతుంది. కార్పోరేటర్ ఇంటిదగ్గర దిగుదామని మనసులో ఆలోచించుకొని.. అక్కడ కార్ ఆపమని రాహుల్ కి చెప్పి అక్కడ దిగేస్తుంది. 

మరోవైపు రాజ్ గుడికి వెళ్ళి అక్కడ కావ్యతో గొడవపడుతాడు. అక్కడ గుడిలోని పూజారి వచ్చి ఇద్దరికి సర్దిచెప్తాడు. పూజారి చెప్పాడని వదిలేస్తున్నా అని రాజ్ అనగా.. నేను కూడా పూజారి చెప్పారనే వదిలేస్తున్నానని కావ్య అంటుంది.  ఆ తర్వాత ఆఫీస్ కి వెళ్తాడు రాజ్. CEO గా మొదటిరోజు మేనేజర్ ని పిలిచి మాట్లాడతాడు. డల్లాస్ ప్రాజెక్ట్ ఏం అయిందని మేనేజర్ మూర్తిని అడుగగా.. "అది మనకు రాలేదంట సర్.. మీకు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పాలని అనుకున్నాను. కానీ మీరు వచ్చాక మొదటి ప్రాజెక్టే  ఇలా చేజారిపోతుందని అనుకోలేదు" అని చెప్తాడు. అప్పుడు రాజ్.. "అవునా మూర్తి గారు, మీరే కదా మేనేజర్.. ఫస్ట్ నుండి ఈ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపింది మీరే, తక్కువ కోట్ చేసింది మీరే కదా మరి మనకెందుకు రాలేదు" అని అడుగుతాడు. 

ఆ తర్వాత  డల్లాస్ ప్రాజెక్ట్ ఓకే అయ్యిందని రాజ్ తమ్ముడికి కాల్ వస్తుంది.  ఆ విషయం రాజ్ కి చెప్పగానే.. మూర్తి కంగారుపడతాడు. మనకెలా వస్తుందని ఆశ్చర్యపోతాడు. వెంటనే రాజ్.. "మూర్తిగారు మీరు మోసం చేశారు. మీరు ఇలా ఫ్రాడ్ చేస్తున్నారని తెలిసే మీకన్నా తక్కువ కోట్ చేశాను" అని చెప్తాడు. ఆ తర్వాత రాజ్ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతాడు. "నువ్వు ఒక స్వరాజ్ ఇండస్ట్రీస్ లోని ఒక కంపెనీకి మేనేజర్ వి నీకే ఇన్ని తెలివితేటలు ఉంటే, స్వరాజ్ ఇండస్ట్రీస్ కి CEO ని, ఇన్ని కంపెనీస్ ని మేనేజ్ చేసే నాకెంత ఉండాలి. నువ్వు చేసిన మోసానికి తగిన శిక్ష పడాలి" అని ఫ్లోర్ క్లీనింగ్ చేపిస్తాడు రాజ్. అలా మొదటిరోజే ప్రాజెక్ట్ దక్కించుకోవడమే కాకుండా.. మోసం చేస్తున్న మేనేజర్ మూర్తిని పట్టిస్తాడు. 

స్వప్న వాళ్ళ ఇంటికెళ్ళి కనకంకి  దుగ్గిరాల కుంటుంబానికి నచ్చేశానని చెప్తుంది. వారింటికి కోడలిగా వెళ్ళబోతున్నాను అని స్వప్న చెప్పగానే.. కనకం ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.