Read more!

English | Telugu

రాజ్ పెళ్ళి దగ్గరుండి జరిపిస్తానని మాటిచ్చిన రుద్రాణి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'బ్రహ్మముడి' సీరియల్ ఎపిసోడ్ -21లోకి అడుగుపెట్టింది. గత వారం నుండి రాజ్ కుటుంబసభ్యులు కనకం ఇంటికి వస్తారనే అంశంతో ఆసక్తికరంగా మారింది. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ లో.. కనకం, స్వప్న బాగా ముస్తాబై కనకం వాళ్ళ అక్క మీనాక్షి ఇంటికి వెళ్తారు.

మరోవైపు రాజ్ అమ్మ పంతులు గారిని పిలిపించి అడగగా.. ఇప్పుడు మంచి సమయం పెళ్లి చూపులకు వెళ్ళండని చెప్తాడు. ఇక రాజ్ అమ్మ మాత్రం స్వప్న వాళ్ళ కుటుంబం నచ్చితేనే ఈ పెళ్లి జరుగుతుందని రాజ్ తో సూటిగా చెప్తుంది. రుద్రాణి కోపంగా.. "నువ్వేం టెన్షన్ పడకు రాజ్.. ఈ పెళ్లి జరిపించే బాధ్యత నాది" అని రాజ్ తో అంటుంది. మా అమ్మ ఏంటీ ఇలా అంటుందని రాహుల్ అనుకొని.. పెళ్లి చూపులు ఎలాగైనా క్యాన్సిల్ చేయాలనుకుంటాడు. మరోవైపు చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ అక్క మీనాక్షిని కలిసిన కనకం..  జరిగిందంతా చెప్తుంది. అలా చెప్పడంతో.. "నాకు కూతుళ్ళు లేరు కదా.. స్వప్న పెళ్లి ఈ ఇంట్లో నా చేతుల మీదుగా జరిపిస్తాను" అని మీనాక్షి చెప్తుంది.

రాహుల్, స్వప్నకి ఫోన్ చేసి తను లాంచ్ చేయబోతున్న ఒక ప్రోగ్రాంకి స్వప్నని చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేస్తాడు. స్వప్న హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాని పెళ్లిచూపులు పెట్టుకొని బయటికి వెళ్తే.. అమ్మ చంపేస్తుందని మనసులో అనుకుంటుంది. రాహుల్ మాత్రం గంటలో పంపించేస్తానని ఫ్లర్టింగ్ చేస్తాడు. అలా అనేసరికి స్వప్న ఓకేనని చెప్తుంది. మరోవైపు రాజ్ ఫ్యామిలీ పెళ్లిచూపులకు వస్తున్నారని కావ్య పిండివంటలు చేసి చెల్లెలు అప్పు వస్తే తనతో పంపిద్దామని ఎదురుచూస్తుంటుంది. ఇక స్వప్న, రాహుల్ దగ్గరికి వెళ్తుండగా కనకం చూస్తుంది. "ఇప్పుడెక్కడికి వెళ్తున్నావ్.. వాళ్ళు వచ్చే టైం అయింది" అని కనకం అంటుంది. "అమ్మా బ్యూటీ పార్లర్ కి వెళ్ళి టచప్ చేసుకొని వస్తాను" అని అంటుంది.. ఇంతలోనే కృష్ణమూర్తి నడుచుకుంటూ కనకం వాళ్ళ దగ్గరికి వస్తాడు. పెళ్లి చూపులు కాదని స్వప్న రాహుల్ దగ్గరికి వెళ్తుందో లేదో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.