Read more!

English | Telugu

దూసుకెళ్తున్న కాదల్ కురిసే.. యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్!

 


ప్రస్తుతం యూట్యూబ్ లో తెలంగాణ భోనాలు, కల్కి, ఎస్ ఎస్ రాజమౌళి మోడ్రన్ మాస్టర్స్, నాని మూవీ గుర్తుందా శనివారం లాంటివి ఫుల్ ట్రెండింగ్ లో‌ ఉన్నాయి.

అయితే వీటితో పోటీగా మరికొన్ని వెబ్ సిరీస్ లు, తెలంగాణ జానపద పాటలు ఉన్నాయి. అయితే డ్యాన్సర్, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ మెహబూబ్ , బిగ్ బాస్ ఫేమ్ శ్రీసత్య కలిసి చేసిన ఓ మ్యూజిక్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 5 మిలియన్ వ్యూస్ ని దాటిన ఈ మ్యూజిక్ వీడియో ని మెహబూబ్, శ్రీసత్య కలిసి కాశ్మీర్ లోయల్లో మంచులో షూట్ చేశారు.  సురేష్ బనిశెట్టి రాసిన లిరిక్స్ మ్యూజిక్ వీడియోకి ప్రాణం పోశాయి. భార్గవ్ రవడ సినిమాటోగ్రఫీ చేయగా మనీష్ కుమార్ మ్యూజిక్ అందించాడు. వైశు మాయ, మనీష్ కుమార్ ఈ పాటని పాడగా పవన్ కోపలి ఎడిట్ చేశాడు. ఏప్రిల్ 13 న మెహబూబ్ తన సొంత యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా నిన్నటికి 5 మిలియన్ వ్యూస్ ని దాటేసింది.  ఇక ఆ విషయాన్ని చెప్తూ మెహబూబ్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. 

శ్రీసత్య కూడా తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియో సాంగ్ లింక్ ని పెట్టి అయిదు మిలియన్లు దాటేసిందని చెప్పుకొచ్చింది.  శ్రీసత్య, మెహబూబ్ కలిసి బిబి జోడిలో పార్టిసిపేట్ చేశారు‌. అయితే వీరికి అంతగా ఫేమ్ రాలేదు‌‌‌.‌ ఇద్దరు బిగ్ బాస్ ద్వారానే తమ సత్తా చాటుకొని ఫాలోయింగ్ ని పెంచుకున్నారు. ప్రస్తుతం శ్రీసత్యకి వన్ మిలయన్ ఫాలోవర్స్ ఉండగా,మెహబూబ్ కి వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఇద్దరు ప్రమోషన్స్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటున్నారు.  మరి వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ మ్యూజిక్ వీడియో యూట్యూబ్ లో ఉంది. ఓసారి చూసేయ్యండి.