English | Telugu

Jayam serial: గంగ డ్రామా హిట్టు.. నిజం చెప్పేసిన శేఖర్!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -155 లో... రుద్ర నిద్ర లేచేసరికి గంగ గదిలో ఉండదు. ఆ శేఖర్ ని కలవడానికి వెళ్లి ఉంటుంది. ఒకసారి శ్రీనుకి ఫోన్ చేద్దాం అనుకునే లోపు టేబుల్ పై లెటర్ కనిపిస్తుంది. అందులో గంగ.. నేను ఏ తప్పు చెయ్యలేదని నిరూపించే దారి కనిపించడం లేదు సర్.. అందుకే నేను ఉండను.. మీ కులదైవం దగ్గరికి వెళ్లిపోతున్నానని రాస్తుంది. అది చూసి రుద్ర ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తాడు. అసలు నా కుటుంబానికి ఎవరి దిష్టి తగిలిందని పెద్దసారు బాధపడతాడు. గంగ కోసం రుద్ర తన కుల దైవం గుడికి బయల్దేరతాడు.

మరొకవైపు జరిగింది అంతా పారుకి చెప్తారు. గంగ ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని ఇషిక చెప్పగానే పారు హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే వీరుకి శేఖర్ ఫోన్ చేసి మాట్లాడుతాడు. నువ్వు గంగకి వ్యతిరేకంగా చెప్పడంతో తను ఇంట్లో నుండి వెళ్ళిపోయింది.. ఇక తను ఈ లోకంలో ఉండదు. నువ్వు కూడా ఇక నాకు కాల్ చెయ్యకు.. నీతో అవసరం అయిపోయిందని వీరు అనగానే శేఖర్ షాక్ అవుతాడు. గంగకి ఏమైందని టెన్షన్ పడుతాడు.

మరొకవైపు గంగ ఏడుస్తూ గుడిలో కత్తితో తొందరగా పొడుచుకుంటుంది. అప్పుడే శేఖర్ అక్కడికి వస్తాడు. రుద్ర కూడ వస్తాడు. మరొకవైపు పారు శకుంతల దగ్గరికి వెళ్తుంది. అయ్యో పాపం గంగ ఎంత పనికి చేసింది. వాళ్ళ అమ్మనాన్నకి చెప్పారా.. ఒకవేళ గంగ చనిపోతే వాళ్ళ నాన్న అసలే మూర్ఖుడు.. మీరే కావాలని చేశారని అంటాడు. అందుకే చెప్పండి అని పారు అనగానే పెద్దసారు కోప్పడతాడు. గంగతోనే రుద్ర ఇంటికి వస్తాడని పెద్దసారు చెప్తాడు.

మరొకవైపు ఎంత పని చేసావ్ గంగ.. నేను అబద్ధం చెప్పాను.. నా వల్లే ఇదంతా అని శేఖర్ ఏడుస్తుంటే రుద్ర వింటాడు. అప్పుడే గంగ లేస్తుంది.. ఇదంతా నాటకం అన్నా.. నీ నుండి నిజం చెప్పించండానికి అని గంగ అనగానే శేఖర్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.