English | Telugu

Jayam serial: తనపై పడ్డ నిందని అబద్ధమని గంగ నిరూపించుకుంటుందా?

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -154 లో... గంగ బస్తీలో ఉండే శేఖర్, శకుంతల వాళ్ళ ఇంట్లోకి వస్తాడు. గంగకి ట్రైప్యాడ్ ఇచ్చింది నేనే అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏంటి అన్న అలా నా గురించి అబద్ధం చెప్తున్నావ్.. నన్ను నీ సొంత చెల్లిగా చూసావ్, ఇలా ఎలా అబద్ధం చెప్తున్నావని గంగ అడుగుతుంది. అతను నిజమే చెప్పాడు కదా మరి ఎందుకు అతన్ని భయపెడుతున్నావని ఇషిక అంటుంది.

ఆ తర్వాత శేఖర్ అక్కడ నుండి వెళ్ళిపోయాక గంగ అతని వెనకాలే వెళ్లి ఎందుకన్నా అబద్ధం చెప్పావని అడుగుతుంది. గంగ అతన్ని అబద్ధం చెప్పమని రిక్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు ఒకసారి వెళ్తే బెటర్ అని ఇషిక బయటకు వెళ్తుంది. ఎందుకు అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నావని గంగని ఇషిక అడుగుతుంది.

సూర్య, స్నేహ, వంశీ వచ్చి ఎవరో ఒకతను వచ్చి వదిన గురించి ఏదో చెప్తే నమ్మేస్తారా అంటారు. నేను చెప్పింది నిజమేనని చెప్పి శేఖర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. గంగ లోపలికి వచ్చి.. నేను ఏ తప్పు చెయ్యలేదు.. అతను ఎందుకు అలా చెప్పాడో ఇప్పటికి అర్థం అవ్వడం లేదని గంగ ఇంట్లో వాళ్ళతో అంటుంది.

సర్ నేను తప్పు చేసానంటే మీరు నమ్ముతున్నారా అని రుద్రతో గంగ అంటుంది. నోరు ముయ్ ముందు ఆ ఏడుపు ఆపు.. తప్పు చెయ్యనప్పుడు ఎందుకు అలా ఏడవడమని రుద్ర అనగానే అంటే తను ఏం తప్పు చెయ్యలేదని నమ్ముతున్నావా అని వీరు అనగానే అవును నమ్ముతున్నాను.. ఎందుకు అంటే షీ ఈజ్ మై వైఫ్ అని రుద్ర అంటాడు. మొదటి నుండి అన్ని చూస్తే గంగని ఎవరో టార్గెట్ చేసారని అర్థం అవుతుందని గంగ కి సపోర్ట్ గా రుద్ర మాట్లాడుతాడు.

తప్పు చేసినట్లు క్లియర్ గా కనిపిస్తుంది అయినా నీ మాటలు ఎందుకు నమ్మాలి. నీకు ఇరవై నాలుగు గంటలు టైమ్ ఇస్తున్న ఆలోపు నీపై పడ్డ నింద.. నిజం కాదని నిరూపించాలి లేదంటే ఇంట్లో ఉండవని శకుంతల అనగానే దానికి గంగ ఒప్పుకుంటుంది.

ఆ తర్వాత గంగ వచ్చి బాధపడుతుంటే రుద్ర వచ్చి మంచిగా థింక్ చెయ్ ఏదో ఒక దారి దొరుకుతుందని అంటాడు. గంగకి ఏం చేయాలో అర్థం కాదు. రుద్ర దగ్గరుండి గంగకి సలహా ఇస్తాడు. ఆ తర్వాత ఇషిక, వీరు, పారు ముగ్గురు మాట్లాడుకుంటారు. శేఖర్ ని ఎలా బ్లాక్ మెయిల్ చేసి రప్పించారో ఇషిక, వీరు కలిసి పారుకి చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.