Read more!

English | Telugu

జీవితంలో చాలా తప్పులు చేశా...అమ్మని గుడికి కూడా తీసుకెళ్లలేదు


 

సండే అంటే చాలు శ్రీదేవి డ్రామా కంపెనీ కామెడీతో ఫుల్ ఎంజాయ్ చేసే డే అన్నమాట. అలాంటి షో ప్రతీ వారం లాగే ఈ వారం కూడా ఎంటర్టైన్ చేయడానికి రాబోతోంది. రీసెంట్ గా నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ప్రతీ వారం సరదాగా నవ్వుతూ ఉండే జడ్జ్ ఇంద్రజ ఈ వారం ఏడ్చేసింది. మే 12 న మదర్స్ డే సందర్భంగా స్పెషల్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. ఆ ప్రోమో మొదట్లో సరదా సరదాగా సాగింది. కానీ చివరిలో మాత్రం బాగా కన్నీళ్లు పెట్టించింది. ఇంద్రజ పూర్తి ఎమోషనల్ గా మారిపోయింది. ఈ ఈవెంట్ కి ఫైమా, అంజలి, సత్య వంటి వాళ్లంతా  వారివారి మదర్స్ తో ఈ షోకి వచ్చి ఆడిపాడారు.  అందులో రష్మీ "మమ్మీ వర్సెస్ డాటర్స్" అంటూ ఒక గేమ్ ని నిర్వహించింది.

బుల్లెట్ భాస్కర్, ఇమాన్యుల్, నూకరాజు, నాటీ నరేష్ వంటి కమెడియన్లు తాము అమ్మగా భావించే ఇంద్రజని సన్మానించారు. ఆమెకు ఒక్కొక్కళ్ళు ఒక్కో గిఫ్ట్ ఇచ్చారు. నూకరాజు ఇంద్రజను అమ్మా అని పిలుస్తాడు కాబట్టి మదర్స్ డే సందర్భంగా ఆమెకు ఒక మంచి చీరని గిఫ్ట్ చేసాడు. వారందరూ చూపించే ప్రేమకు ఇంద్రజ చాలా ఎమోషనల్ ఐపోయింది. తన తల్లిని గుర్తు చేసుకుంది. ఎందుకంటే జీవితంలో ఎంత మంది ఉన్నా, ఎన్ని రిలేషన్ షిప్స్ ఉన్నా తల్లి, తండ్రి లేకపోతే అనాధలమే అవుతాం అని ఇంద్రజ కంటతడి పెట్టుకుంది. తాను తన జీవితంలో ఎన్నో తప్పులు చేశానని  ఒక సంవత్సరం పాటు తన తల్లి తనను గుడికి తీసుకెళ్లామని అడిగినా తీసుకెళ్లలేదని...ఇప్పుడు ఒక్క రోజు వస్తే తాను తన తల్లికి చేయాల్సినవన్నీ చేస్తానంటూ ఏడ్చేశారు. ఇక రష్మీ ఆమెను ఓదార్చారు. ఇలా ఈ ఎమోషనల్ ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ ప్రసారం కాబోతోంది.