English | Telugu

ఇంద్రజ, సుధీర్ మీద ఆది కౌంటర్స్...అమ్మాకొడుకులిద్దరే పోతారు అంటూ కామెంట్స్

డిసెంబర్ 31 కి ఇంకా ఎన్నో రోజులు లేదు. బుల్లితెర రకరకాల ఈవెంట్స్ తో షోస్ లో అలరించడానికి సిద్ధంగా ఉంది. రీసెంట్ గా ఒక ప్రోమో రిలీజ్ అయ్యింది. అదే "కం టు ఢీ పార్టీ..2026 ఈటీవీ న్యూ ఇయర్ ఈవెంట్" పేరుతో ఒక లేటెస్ట్ టీజర్ వచ్చింది. ఇక ఈ ప్రోగ్రాం 31 వ తేదీ రాత్రి 9 .30 కి ప్రసారం కాబోతోంది. ఈ షోకి హోస్ట్ గా సుధీర్ కనిపించాడు. "సుధీర్ గాడి పార్టీ అంటే వినడమే కానీ సూసిందే లేదు కదా..ఇప్పుడు చూపిస్తా అసలు పార్టీ ఏంటో" అంటూ చెప్పాడు సుధీర్. ఈ షోలో ఇంద్రజ, ఆలీ, కావ్య, పండు, జాఫర్, ఆది వంటి వాళ్లంతా వచ్చారు. డాన్స్ లు చేసారు.

"మీ అమ్మకు చెప్పు నీ సంగతి తెలుస్తాయి ఇవ్వాళ" అన్నాడు ఆది. "అమ్మను ఎమన్నా అంటే గనక బాగోదు" అంటూ సుధీర్ వార్నింగ్ ఇచ్చాడు. "ఒక్కసారి నాకు ఊపొచ్చాకా అమ్మ కొడుకులిద్దరినీ ఊపేస్తా" అన్నాడు ఆది. "నీకు ఊపు రావాలేమో నేనెప్పుడూ ఊపు మీదే ఉంటా" అన్నాడు సుధీర్. "పోతారు మొత్తం పోతారు" అని సుధీర్ ఆదిని అన్నాడు. "ఎవరు పోరు మీ అమ్మాకొడుకులిద్దరే బయటకు పోతారంతే" అన్నాడు ఆది. ఇక నెటిజన్స్ ఐతే కామెంట్స్ చేస్తున్నాడు "ఆది - ఇంద్రజ కాంబినేషన్ సూపర్, రష్మీ లేదా పుష్ప, సుధీర్ ఫాన్స్ ఇక్కడ, ఆది ఫాన్స్ ఇక్కడ" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.