English | Telugu
నిరుపమ్ ఇంట్లో హనుమాన్ చాలీసా పారాయణం
Updated : Apr 27, 2023
మంజుల-నిరుపమ్ ఈ సీరియల్ యాక్టర్స్ గురించి తెలియని వాళ్లంటూ ఎవరూ ఉండరు. చంద్రముఖి సీరియల్తో వీరి ప్రయాణం మొదలైంది. కన్నడ నటి అయిన మంజుల చంద్రముఖి సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యింది. ఇక ఈ సీరియల్ టైంలోనే వీరి మధ్య మొదలైన స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. యూట్యూబ్లో "మంజుల నిరుపమ్" అనే చానెల్ ద్వారా నిరుపమ్ కి సంబంధించి, తన బాబు గురించి తన పర్సనల్స్ అన్నిటి గురించి వీడియోస్ చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు అక్షయ తృతీయ సందర్భంగా తమ ఇంట్లో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రతీ ఏడాది ఇంట్లో ఈ పారాయణం నిర్వహించుకుంటారని చెప్పారు. ఐతే కోవిడ్ వచ్చిన కారణంగా రెండు మూడేళ్లు ఇంట్లో చేయలేదట కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ డివోషనల్ ప్రోగ్రాంని ఇంట్లో వాళ్ళ అత్తమ్మ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నట్లు మంజుల చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్, రిలేటివ్స్, సీరియల్ టీమ్స్ అంత పార్టిసిపేట్ చేయబోతున్నట్లు చెప్పారు. ఇక ఈ పూజకి పల్లకిలో పెళ్లికూతురు సీరియల్ టీం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. హనుమాన్ సహస్ర నామ స్తోత్రం, అలాగే అక్షయ తృతీయ సందర్భంగా లక్ష్మి పూజ చేయించారు. ఇక ఈ హనుమాన్ చాలీసా పారాయణం 108 సార్లు చేయాలి కాబట్టి ఆర్కెస్ట్రాలో స్పెషలిస్ట్స్ ని పిలిపించి 108 ట్యూన్స్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఈ పూజ ఐపోయాక వచ్చిన గెస్ట్స్ అందరికీ లంచ్ కూడా ఏర్పాటు చేశారు ఇలా ఒక డివోషనల్ వీడియోని మంజుల తన యూట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేసింది. బుల్లితెరపైనే కాదు ఈ జోడి సోషల్ మీడియాలోనూ బాగానే పాపులర్ అయ్యింది.