Read more!

English | Telugu

వసుధార ఇప్పటికైనా రిషికి నిజం చెప్పేనా!

'గుప్పెడంత మనసు' సీరియల్ లో  వసుధార, రిషీల ప్రేమ కథని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. అంతలా ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ ఎపిసోడ్-664 లో.. రిషి ఇంట్లోకి వసుధార రాగానే అందరూ విసుక్కుంటారు. "ఇంకా ఏం మిగిలిందని మళ్ళీ వచ్చావ్. మా రిషి బ్రతికున్నాడో... లేడోనని చూసి పోదామని వచ్చావా? దయచేసి ఇక్కడి నుండి వెళ్ళండి వసుధార గారు" అని జగతి చెప్తుంది. "ఏంటి మేడం.. మీరు నాకు గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నారు" అని వసుధార అంటుంది. అలా కాసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది.  వసుధార వల్లనే రిషి బయటకు వెళ్ళిపోయాడని కుటుంబసభ్యులంతా తనపై తీవ్ర అసంతృప్తితో ఉంటారు. దీంతో వసుధార ఎంత బాధపడినా ఎవరూ వినకుండా బయటకు గెంటేస్తారు. 

ఆ తర్వాత తను ఎప్పుడు వెళ్లే అమ్మవారి గుడికి వెళ్ళి, తన మనసులో ఉన్న బాధనంతా చెప్పుకుంటుంది. కాసేపటికి అదే గుడికి రిషి వస్తాడు. అతను మొక్కుకొని వెళ్ళిపోతుండగా అక్కడే ఉన్న వసుధార చూసి, తనని ఆపే ప్రయత్నం చేస్తుంది. కానీ రిషి అదేమీ పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంటాడు. తను ఎంత బ్రతిమాలినా రిషి పట్టించుకోవట్లేదని తన గురించే ఆలోచిస్తూ పరధ్యానంలో నడుచుకుంటూ  వెళ్తుంది. అప్పుడే ఒక ట్రక్కు తనని ఢీ కొట్టబోతుండగా ఆ పక్క నుండి వెళ్తున్న రిషి గమనించి వెంటనే తనని కాపాడతాడు. ఆ తర్వాత క్యాబ్ బుక్ చేసి తనని వెళ్ళమని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. 

ఇలా అడుగడుగునా వసుధార అవమానాలు ఎదుర్కొంటుంది. రిషికి అసలు నిజం వసుధార ఎప్పుడు చెప్తుందోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే తర్వాతి ఎపిసోడ్‌లోనైనా వీళ్ళు కలసిపోతారా? లేదా? అనే ఆసక్తి అందరిలోను నెలకొంది. తర్వాతి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి మరి.