Read more!

English | Telugu

Guppedantha Manasu : ఎండీ పదవి కోసం మనుని శైలేంద్ర బయటకు తీసుకురాగలడా?

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1067 లో.. ఎండీగా తప్పుకుంటానంటూ శైలేంద్రకి వసుధార చెప్తుంది. దీని వెనకాల ఏదైనా ప్లాన్ ఉందేమోనని శైలేంద్ర అనుకుంటాడు. ఆ తర్వాత వసుధార బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. అందులో కూడా నేను ఎండీగా ఉండలేనని, మీలో ఎవరైనా ఉండండి  అని వసుధార చెప్తుంది. ఫణీంద్రని ఉండమని బోర్డు మెంబర్స్ అంటారు.. నేను ఎండీగా ఉన్నవాళ్లకి హెల్ప్ చేయడం తప్ప నేను ఉండనని ఫణీంద్ర అంటాడు.

ఇక వేరే ఎవరున్నారు శైలేంద్ర గారు ఉన్నారు అతన్నే ఎండీగా చెయ్యాలనగానే.. ఫణింద్ర కూడా సరే అంటాడు. ఆ మాటతో శైలేంద్ర మనసు లో మురిసిపోతుంటాడు. కానీ ఎండీ బాధ్యతలు శైలేంద్రకి అప్పగించాలంటే ఒకరి పర్మిషన్ కావాలి.. అతనే మను. నేను ఎండీ గా ఉన్నప్పుడు కాలేజీకి యాభై కోట్లు అప్పు ఇచ్చాడు. ఇప్పుడు అతను బోర్డు మెంబర్ కూడా అతన్ని కూడా అడగాలని వసుధార అంటుంది. అతనెల వస్తాడు జైల్లో ఉన్నాడు కదా అని శైలేంద్ర అంటాడు. రావాలని వసుధార అంటుంది. ఆ తర్వాత వసుధార, మహేంద్ర ఇద్దరు ఇంటికి వెళ్లి అనపమతో మాట్లాడతారు. ఏంజిల్ ఫోన్ చేసింది.. మీరు ఒక్కరే ఇక్కడ బాధపడుతున్నారు.. అక్కడికి రమ్మని చెప్పిందని వసుధార అంటుంది. నీకు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉండమని అనుపమకి మహేంద్ర చెప్తాడు. బాధలో ఉన్నప్పుడు ఎక్కడుంటే ఏంటి? నేను ఇక్కడే ఉంటానని అనుపమ అంటుంది. మరొకవైపు ఈ అవకాశం మనం ఉపయోగించుకోవాలి.. వాళ్లే ఎండీ పదవి ఇస్తామని అన్నప్పుడు తీసుకోవాలి కానీ ఇప్పుడు ఆ రాజీవ్ లేడు కదా.. నిజం చెప్పు రాజీవ్ బ్రతికే ఉన్నాడా అని శైలేంద్రని దేవయాని అడుగుతుంది.. ఎందుకు అలా అన్నిసార్లు అడుగుతున్నావ్? పక్కా సాక్ష్యం ఉంది కదా అని శైలేంద్ర అంటాడు. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావని దేవాయని అనగానే.. అదేం లేదని శైలేంద్ర అంటాడు.. ఆ తర్వాత వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోయాక వసుధార ఫోన్ లైన్ లోనే ఉంటుంది. ధరణి వచ్చి ఫోన్ తీసుకొని విన్నావా? వాళ్ళు మాట్లాడుకున్నవి అందులో రాజీవ్ బ్రతికి ఉన్నట్టు ఎక్కడ అన్లేదు కానీ మా అయన మాటల్లో ఏదో తేడా ఉందని ధరణి అంటుంది. అందుకే శైలేంద్రని కనిపెడుతూ ఉండు.. నేను కూడా నా ప్రయత్నం నేను చేస్తున్నాను.. ఎండీ పదవి కావాలంటే మను గారు ఉండాలని చెప్పానని వసుధార అంటుంది. అప్పుడే శైలేంద్ర.. ఎం చేస్తున్నావని ధరణిని అడుగుతాడు. ఏం లేదని ధరణి కవర్ చేస్తుంది. మా అయన ఎక్కడికో వెళ్తున్నాడని వసుధారకి ధరణి చెప్తుంది. శైలేంద్రని ఫాలో చెయ్యడానికి ఒక మనిషి ఉన్నాడని వసుధార అంటుంది.
 
శైలేంద్ర వెనకాలే మహేంద్ర ఫాలో అవుతుంటే.. అతడిని శైలేంద్ర చూసి ఎక్కడికి వెళ్తున్నావ్ బాబాయ్ అంటు అడుగుతాడు. రాజీవ్ ని వెతకడానికి అంటూ మహేంద్ర చెప్తాడు. అప్పుడే రాజీవ్ దూరం నుండి చూస్తుంటే.. ఎక్కడ రాజీవ్ ని మహేంద్ర చూస్తాడేమోనని శైలేంద్ర టెన్షన్ పడుతాడు. మహేంద్ర వెళ్లిపోయాక.. రాజీవ్ దగ్గరకి శైలేంద్ర వచ్చి.. నువ్వు కొన్ని రోజులు ఎవరికి కన్పించకని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.