Read more!

English | Telugu

Guppedantha Manasu : మను, వసుధార కలిసి రిషిని కనిపెడతారా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1049 లో....అందరు భోజనం చేస్తుంటారు. రేపు అందరు కాలేజీకీ వసున్నారా అని మహేంద్ర వసుధారని అడుగుతాడు. పేరెంట్స్ లెక్చరర్ మీటింగ్ కదా అందరూ వస్తున్నారని వసుధార అంటుంది. అనుపమ వస్తున్నావా? మను కూడా వస్తున్నాడని మహేంద్ర అనగానే.. లేదు రావడం లేదని అనుపమ అంటుంది. రండి అని వసుధార రిక్వెస్ట్ చేస్తుంది. అనుపమ సైలెంట్ గా ఉండడంతో మౌనం అంగీకారం, వస్తుందిలే అందరం కలిసే వెళదామని మహేంద్ర అంటాడు.

మరొకవైపు ఇప్పుడు మనం సరైన దారిలో వెళ్తున్నాం.. ఇప్పుడు విజయం సాధిస్తామని దేవయాని అంటుంది. ఇప్పుడేం జరిగిందని అలా మాట్లాడుతున్నావని శైలేంద్ర అంటాడు. అసలు వసుధారని డాడ్ ఒక్క మాట అననివ్వలేదు. అంత మంచిగా ఉంటే ఎలా అమ్మ.. ఇలా ప్రతిదానికి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వెళ్తుంటే ఎలా? మనకు శత్రువులు వాళ్ళ కాదు డాడ్ నే అని శైలంద్ర ఫ్రస్ట్రేషన్ అవుతుంటాడు. డాడ్ ని ఆలా అనకు తను మంచిగ ఉన్నంతవరకే మన ఆటలు కొనసాగుతాయని దేవాయని అంటుంది. ఆయనకు ప్రేమించడం తెలుసు.. ద్వేషించడం తెలుసు.. నువు ఇంకొకసారి అలా అనకు. నిన్ను ఎండీ కుర్చీలో కూర్చొపెట్టాలి.. దానికి నా దగ్గర ఒక ఆయుధం ఉందని దేవయాని అంటుంది. ఆయుధం ఏంటని శైలేంద్ర అడుగుతాడు. చెప్తాను అది నీకు చాలా హెల్ప్ అవుతుందని దేవయాని అనగానే.. హెల్ప్ అంటే మీరు ఏదో చేస్తన్నారని అర్ధం అవుతుందంటూ ధరణి వస్తుంది. ఇక ధరణి తన వెటకారం మాటలతో వాళ్లకి చిరాకు తెపిస్తుంది.

అ తర్వాత  మను దగ్గరికి వసుధార వస్తుంది. మేడన్ రెస్ట్ తీసుకుంటే బాగుండు.. ఎందుకు కాలేజీకీ రమ్మంటున్నారని వసుధారతో మను చెప్పగా.. మేడమ్ కి గాయం తగ్గిందని వసుధార అంటుంది. కాలేజీ లో దేవయాని గారు అన్న మాటల గురించి బాధపడ్డారు కదా అని మను అంటాడు. దాంతో రిషిపై ఉన్న ప్రేమని మనుకి చెప్తుంది వసుధార. సర్ ఎక్కడున్నా కనిపెట్టి తీసుకొద్దామని వసుధారకి మను చెప్తాడు. మరొకవైపు రాజీవ్ దేవయాని, శైలేంద్ర లు ఒక ప్లాన్ చేస్తారు. అ తర్వాత రాజీవ్ పేరెంట్స్ మీటింగ్ కి వెళ్లే పేరెంట్స్ తో మాట్లాడి.. వాళ్లకి డబ్బులిచ్చి తాను చెప్పినట్టు చెయ్యమని చెప్తాడు. మరుసటిరోజు ఉదయం కాలేజీలో పేరెంట్స్ , లెక్చరర్స్ మీటింగ్ కి అందరు వస్తారు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.