Read more!

English | Telugu

Guppedantha Manasu : బుద్ధి ఉందా అసలు, ఎందుకిలా చేశావ్.. మను చెంపలు వాయించేసిన అనుపమ!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1027 లో.. మహేంద్ర అనుపమలకి వసుధార కాఫీ తీసుకొని వస్తుంది. అనుపమ ఏదో ఆలోచిస్తూ డల్ గా ఉంటుంది. అది చూసిన మహేంద్ర.. ఏమైందని అడుగుతాడు. ఏం లేదంటూ అనుపమ చెప్తుంది. నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఎప్పుడు ఎలా ఉంటున్నారో అర్థం కావడం లేదని మహేంద్ర అనగానే.. నన్నే అంటున్నావ్ కదా అని అనుపమ అడుగుతుంది.

ఇక్కడ నుండి దూరంగా వెళదామని చెప్పాను కానీ మను మన జీవితాల్లోకి వచ్చినప్పటి నుండి ఒక ఫీలింగ్ వచ్చింది.. దైర్యంగా ఉందని మహేంద్ర అంటాడు.. అవును మావయ్య నాకు రిషి సర్ విషయంలో కూడా హెల్ప్ చేస్తానని అన్నారని వసుధార అంటుంది. ఆ తర్వాత జగతి ఫోటో దగ్గరికి మహేంద్ర వెళ్లి మాట్లాడతాడు. ఆ తర్వాత రిషి ఫోటో దగ్గరికి వెళ్లి తమ జ్ఞాపకాలు గుర్తుకుచేసుకుంటాడు. మరొకవైపు మనుతో ఎలాగైనా ఈ రోజు మాట్లాడాలి మళ్ళీ వాడు ఎందుకు వచ్చాడో కనుక్కోవాలని అనుపమ తన క్యాబిన్ కి వెళ్తుంది. వెళ్లేసరికి మను లేకపోవడంతో మళ్ళీ వద్దామంటూ అనుపమ తిరిగి వెళ్తుంటే.. శైలేంద్ర క్రియేట్ చేసిన మను, వసుధారల పోస్టర్లు చూసి షాక్ అవుతుంది. అప్పుడే వసుధార కూడా వచ్చి వాటిని చూస్తుంది.

ఆ తర్వాత మను రాగానే ఏంటి ఇది అని అనుపమ కోప్పడుతుంది. అనుపమ కోపంగా మను రెండు చెంపలపై కొడుతుంది. ఎందుకు ఇలా చేసావ్ బుద్ధి లేదా నీ మనసుకి ఏదనిపిస్తే అది చేస్తావా అంటూ పోస్టర్లు చింపేస్తుంది. మను చెప్పబోతుంటే అసలు అనుపమ వినిపించుకోదు. పాపం వసుధార తన గురించి తెలిసే ఇలా చేస్తున్నావా.. నువ్వు అసలు నాకు కన్పించకు.. ఇక్కడ నుండి వెళ్లిపో.. ఇక ఎప్పటికి ఇటువైపు రాకని మనుని అనుపమ తిడుతుంది. మీరు అలా మాట్లాడకండి వెళ్ళిపోతానంటూ మను అంటాడు. మీ గురించి చాలా గొప్పగా అనుకున్నానని వసుధార అంటుంది. అదంతా శైలేంద్ర విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.