Read more!

English | Telugu

నటుడు సాయికిరణ్ కి గోల్డెన్ బటన్...

 

బుల్లితెర మీద హిట్ సీరియల్ గా నిలిచింది గుప్పెడంత మనసు. ఇందులో జగతి, మహేంద్ర, రిషి, వసుధారా, సాక్షి మెయిన్ క్యారెక్టర్స్. నటుడు సాయికిరణ్ ఇందులో మహేంద్రగా ప్రధాన పాత్ర పోషించాడు. ఇక సీరియల్ లో ఆయన క్యారెక్టర్ కి పిచ్చ ఫాన్స్ ఉన్నారు. ఇక సాయి కిరణ్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తే. ఎందుకంటే రకరకాల ఇంటరెస్టింగ్ వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాడు. అందులో చాలా ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. దాంతో సాయికిరణ్ వీడియోలు ఫుల్ వైరల్ అవుతూ ఉంటాయి.

కొన్ని భలే ఫన్నీగా కూడా ఉంటాయి. ఈ సీరియల్ లో నటించే ప్రతీ ఒక్కరితో కూడా రీల్స్ చేసి వాటిని షేర్ చేస్తూ ఉంటారాయని. ఆయనకు రిషి అన్నా, వసుధారా అన్నా చాలా అభిమానం. ఆఫ్ లైన్ లో వాళ్ళ అల్లరి గురించి ఆయన చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు కూడా. అలాంటి సాయి కిరణ్ కి ఇప్పుడు వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఐనందుకు యూట్యూబ్ నుంచి గోల్డెన్ బటన్ వచ్చింది. ఇక దాన్ని అందుకున్న ఆయన ఆనందం అంతా ఇంతా కాదు. "శ్రీరామనవమి శుభాకాంక్షలు. గోల్డెన్ బటన్‌ అందుకున్నా.

నా ప్రియమైన ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ యూట్యూబ్ గోల్డెన్ బటన్ ని నా ప్రియమైన ప్రీతీ శర్మతో , నా పడమటి సంధ్యా రాగం సీరియల్ కుటుంబంతో దీన్ని ఓపెన్ చేయిస్తాను.. ఎలా అంటే సిల్వర్ బటన్ ని నా ప్రియమైన గుప్పెడంత మనసు సీరియల్ నటులు ముఖేష్ - రక్షతో ఎలా ఆవిష్కరించానో అలాగే చేయిస్తాను. ఆ వీడియో త్వరలో మీముందుకు వస్తుంది." అని ట్యాగ్ లైన్ పెట్టారు సాయి కిరణ్.  ఇక ఆయన ‘నువ్వే కావాలి’ మూవీ తర్వాత ‘ప్రేమించు’ ‘మనసుంటే చాలు’ ‘ఎంత బావుందో’ వంటి హిట్ మూవీస్ లో హీరోగా నటించాడు. అలాగే సీరియల్ విషయానికి వస్తే  ‘కోయిలమ్మ’  ‘పడమటి సంధ్యారాగం’ వంటి సీరియల్స్ లో నటించారు.