Read more!

English | Telugu

Eto Vellipoyindhi Manasu : రామలక్ష్మిని టార్గెట్ చేసిన శ్రీలత.. అతను అడ్డుకోగలడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -89 లో....అందరు భోజనం చేస్తుంటే.. శ్రీలత కావాలనే రామలక్ష్మిని బాధపెట్టాలని చూస్తుంది. మా ఫ్రెండ్ కోడలు పెళ్లి అయినాక ప్రేమించినవాడితో లేచిపోయిందనగానే రామలక్ష్మి తినకుండా వచ్చేసి తన గదిలో బాధపడుతుంటుంది. అప్పుడే సీతాకాంత్ వచ్చి.. ఏమైంది అలా వచ్చావంటూ తన బుజం మీద చెయ్యి వెయ్యగానే రామలక్ష్మి ఇబ్బందిగా చూస్తుంది.

సీతాకాంత్ సారీ చెప్తాడు. మీ అమ్మగారు కావాలనే అంటున్నారని రామలక్ష్మి అంటుంది. తనేదో క్యాజువల్ గా మాట్లాడింది అంతే అనగానే.. లేదు నిన్న కూడా తనకి అభి అనే అతను కాల్ చేసాడట.. నా ముందే అభి అభి అంటూ మీకు ఎవరికైనా తెలుసా అంటుంది. మా అమ్మ ఎందుకు అంటుంది. అభి గురించి మా అమ్మకి తెలియదు కదా అని సీతాకాంత్ అంటాడు. తెలియదని మనం అనుకుంటున్నామని రామలక్ష్మి అంటుంది. నువ్వు కంగారు పడకు త్వరలోనే నిన్ను అభి దగ్గరకి పంపిస్తాను అనబోయి ఆగిపోతాడు. ఆ తర్వాత నిన్ను ఆ మోసగాడి దగ్గరికి ఎలా పంపించాలని సీతాకాంత్ అనుకుంటాడు. ఆ తర్వాత శ్రీలత, సందీప్ ఇద్దరు అభి ఫ్రెండ్ ని బ్లాక్ మెయిల్ చేసి రామలక్ష్మి గురించి నిజం చెప్పమని అంటారు. డబ్బులు ఇస్తారు అయినా నిజం చెప్పడు.. సందీప్ బెదిరించడం అభి గురించి ఇంకా రామలక్ష్మి సీతాకాంత్ లు ఆడుతున్న నాటకం గురించి మొత్తం చెప్తాడు.

మరొక వైపు రామలక్ష్మి అభిమాటలు గుర్తుకూ చేసుకొని నిద్రపోతుంది. ఆ తర్వాత తనతో సీతాకాంత్ ఆ మర్యాదగా ప్రవర్తించినట్లు కల కంటుంది. ఒక్కసారిగా గట్టిగ అరిచేసరికి.. ఏమైందంటూ సీతాకాంత్ అడుగుతాడు. రామలక్ష్మి ఇంకా భయపడుతుంది. మరుసటి రోజు ఉదయం సీతాకాంత్ లేచేసరికి.. రామలక్ష్మి రాత్రంతా నిద్రపోకుండా కూర్చొని ఉంటుంది. అప్పుడే శ్రీలత డోర్ కొడుతుంది. లోపలికి వచ్చి మళ్ళీ తన ఫ్రెండ్ కోడలిలాగా కాదు నా కోడలు అంటు మళ్ళీ ఇండైరెక్ట్ గా రామలక్ష్మిని అంటుంది. దాంతో రామలక్ష్మి మళ్ళీ బాధపడుతుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.