Read more!

English | Telugu

Eto Vellipoyindhi Manasu : ప్రియుడి మాటలకి ఆలోచనల్లో పడ్డ రామలక్ష్మి.. భర్తగా సీతాకాంత్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -81 లో.... రామలక్ష్మి, సీతాకాంత్, అభి ఓ దగ్గర నిల్చొని మాట్లాడుకుంటారు. నీ ప్రవర్తన డౌట్ గా ఉందని సీతాకాంత్ అనగానే ఎందుకు సర్ అని అభి అంటాడు. మనం ముందుగానే క్లియర్ గా మాట్లాడుకున్నాం..  ఇంటికి ఆఫీస్ కి రావొద్దని.. అయినా ఎందుకు వచ్చావ్? అసలు నీ ఉద్దేశం ఏంటని సీతాకాంత్ అనగానే.. రామలక్ష్మిని చూడాలనిపించింది సర్ అందుకే వచ్చానని అభి అంటాడు. ఇప్పుడున్న పరిస్థితులలో మేమిద్దరం నిజంగానే భార్యాభర్తలమని మా చెల్లి నమ్ముతుంది. కానీ మేమ్ ఆడుతుంది నాటకమని తెలిస్తే తనెంత బాధపడుతుందో తెలుసా? మేమిద్దరం నాటకం ఆడుతుందే నా చెల్లి సంతోషం కోసం.. మరి తనకి నిజం తెలిస్తే ఇప్పటివరకు ఆడిన నాటకానికి, మేమ్ పడ్డ కష్టానికి ఫలితం ఏం ఉంది. అందుకే నువ్వు మరోసారి మా ఇంటికి రావడానికి వీల్లేదని అభికి సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు సీతాకాంత్. 

సర్ మీరెంతసేపు మీ వైపు నుండే ఆలోచిస్తున్నారు సర్.. కానీ నేను రామలక్ష్మిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను సర్, ప్రేమించిన అమ్మాయి వేరొకరికి భార్యగా నటిస్తుంటే అది ఎంత బాధగా ఉంటుందో ప్రేమించిన వారికే తెలుస్తుందని రివర్స్ డ్రామా మొదలెడతాడు అభి. నిన్ను భార్యగా నటించమని అడిగిన రోజు నా చేతులు పట్టుకొని బ్రతిమాలారు.. చూడు ఇప్పుడు ఎలా బెదిరిస్తున్నాడో అంటూ రామలక్ష్మితో అభి అంటాడు. బెదిరించడం కాదు పరిస్థితిని అర్థం చేసుకోమని అంటున్నానని సీతాకాంత్ అనగానే.. పరిస్థితులే కాదు మీరేంటో కూడా నాకు అర్థమైంది సర్.. ఆ రోజు మాకు పెళ్ళి చేస్తానని చెప్పారు.. ఈరోజు రామలక్ష్మిని చూడకూడదని అంటున్నారంటూ అభి అంటాడు. ఇప్పటితో మనం ఆడుతున్న నాటకానికి ముగింపు పలికేద్దామని అభి అనగానే.. సర్ మీకు దండం పెడతా వదిలేయండని అభి అంటాడు.

మనం వెళ్ళిపోదాం పదా అని రామలక్ష్మి చేతిని అభి పట్టుకొని తీసుకెళ్తుంటే.. తను ఆగమని చెప్తుంది. మీ అమ్మ ఆరోగ్యంగా ఉందని, నీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదని తెలిసిననాడు నేనే వచ్చేస్తాను.. నన్ను ఎవరు ఆపలేరని రామలక్ష్మి అంటుంది. హాస్పిటల్ లో డబ్బులు కట్టాలన్నావ్ కదా .. మీ అమ్మగారిని చూసినట్టు ఉంటుంది అలాగే డబ్బులు కట్టినట్టు ఉంటుంది పదా అని అభితో రామలక్ష్మి అనగానే.. అభి షాక్ అవుతాడు. ఇప్పుడు వీలు కాదు.. మా బంధువులున్నారని అభి కవర్ చేస్తాడు. ఆ తర్వాత అభికి నచ్చజెప్పి రామలక్ష్మి, సీతాకాంత్ ఇంటికి వస్తారు. మరోవైపు సందీప్ కోసం శ్రీలత ఎదురుచూస్తుండగా అప్పుడే సందీప్ వస్తాడు. ఏం అయిందని శ్రీలత అడుగగా‌.. జస్ట్ మిస్ అయ్యారని చెప్తాడు. దాంతో సందీప్ మీద శ్రీలత కోప్పడతుంది. ఇక అప్పుడే సీతాకాంత్ , రామలక్ష్మి కార్ లో రావడంతో.. ఆ సౌండ్ విని వాళ్ళు వచ్చినట్టున్నారు నువ్వు వెళ్ళని సందీప్ ని పంపిస్తుంది. ఎక్కడికి వెళ్ళారని , దర్శనం బాగా జరిగిందని సీతాకాంత్ ని శ్రీలత అడుగగా.. బాగానే జరిగిందని సీతాకాంత్ అంటాడు. అందమైన అబద్దాలెందుకు చెప్తున్నావ్.. కొబ్బరికాయ కొట్టాలి కదా అలానే ఎందుకు తెచ్చారని శ్రీలత అంటుంది. దాంతో ఇద్దరు షాక్ అవుతారు. రామలక్ష్మికి ఐస్ క్రీమ్ తినాలనిపించింది అందుకే అలా అబద్ధం చెప్పానమ్మా అని సీతాకాంత్ చెప్తాడు. అప్పుడే సీతాకాంత్ వాళ్ళ తాతయ్య వచ్చి.‌ కొత్తగా పెళ్ళైన వాళ్ళని అలా వదిలేయి శ్రీలత.. అలా ప్రతి దానికి ప్రశ్నిస్తే ఎలా చెప్పమని వాళ్ళని లోపలికి వెళ్ళమంటాడు. ఇక సీతాకాంత్, రామలక్ష్మి గదిలోకి వెళ్తారు. ఆ తర్వాత తన డైరీ కోసం సీతాకాంత్ వెతుకుతాడు. అభి మాటలనే తల్చుకుంటూ రామలక్ష్మి ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.