Read more!

English | Telugu

ఏంటండీ ఇలా బుక్ చేసేసారు నన్ను...

సిక్స్త్ సెన్స్ సీజన్ 5 ఈ వారం చాలా సందడిగా సాగింది. ఇందులో టాప్ న్యూస్ రీడర్స్ గా పేరు తెచ్చుకున్న వాళ్ళను పిలిచాడు యాంకర్ ఓంకార్. రెగ్యులర్ గా బ్రేకింగ్ న్యూస్ చదివే  దీప్తి వాజ్ పేయి, రాధిక, ప్రత్యూష, మోనిష ఈ నలుగురు ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఓంకార్ వాళ్ళ లైఫ్ గురించి ఎన్నో విషయాల గురించి మాట్లాడాడు. ఇప్పటి వరకు ఎవరికీ తెలియని దీప్తి లవ్ మేటర్ ని కూడా బయటకు చెప్పించాడు. 

దీప్తి మీరు మంచి సింగర్ కదా ఒక సాంగ్ పాడండని ఓంకార్ అనేసరికి "మాస్టారు, మాస్టారు నా పక్కన నిలిచారు" అని పాడింది. అప్పుడు ఓంకార్ "మీ లైఫ్ లో ఉన్న మీ మాస్టర్ గురించి చెప్పండి" అనేసరికి "ఆయన పేరు నటరాజ్, ఫిలిం మేకింగ్ లో ఉన్నారాయన..మా ఛానల్ లోనే మా పరిచయం అయ్యింది. మేమిద్దరం కలిసి పని చేసాం. అలా ఇద్దరి మధ్య ఇష్టం ఏర్పడింది తర్వాత పెళ్లి చేసుకున్నాం. కొంచెం ఆటిట్యూడ్ ఉన్నవాళ్లు లవ్ ప్రొపోజ్ చేయరు చేయించుకుంటారు కదా..నాకు మంచి మెంటల్ సపోర్ట్ ఇచ్చి లవ్ లో పడేసారు. నేను చెప్పాలని వెయిట్ చేసాను చివరికి చెప్పించుకున్నాను..దేవుడు స్కెచ్ వేసాడు..మేము కలర్స్ ఫిల్ చేసుకున్నాం. మాకు ఒక పాప ఉంది. పేరు విధిజ్ఞా" అని చెప్పింది. 

"మీకు తెలుసా ఫస్ట్ టైం ఈ విషయం మీద తను మాట్లాడింది. ఇప్పటివరకు ఈ విషయం గురించి ఎవరికీ తెలీదు..ఆవిడతో కూడా చెప్పించారు అంటే మీరు మామూలోళ్లు కాదు" అన్నారు ప్రత్యూష, మోనిష. "షోకి పిలిచి ఇలా బుక్ చేస్తారా" అని దీప్తి ఓంకార్ ని అడిగేసరికి "బుక్ చేసేదేముంది ప్రేమ గురించే కదా తెలుసుకున్నాం... మీ ఫాన్స్ అందరికీ మంచి విషయాలే కదా చెప్పారు" అన్నాడు. "బ్రేకింగ్ న్యూస్ చదివే మాతో ఐటెం సాంగ్స్ చేయించేస్తున్నారు" అని ప్రత్యూష అనేసరికి "ప్రతీ ఒక్కరిలో మాస్ ఉంటుంది. ఇప్పుడు ఆ మాస్ బయటకి వచ్చింది" అంతే అన్నాడు.