English | Telugu

Brahmamudi: రాజ్ కి దగ్గరవుతున్న రేఖ.. కావ్యకి పొంచి ఉన్న ప్రమాదం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -917 లో... నీ వల్లే నేను దేశాలు పట్టుకొని వెళ్ళాను.. రాజ్ బావకి నన్ను ఇచ్చి చేసి ఉంటే ఈ ఇంట్లోనే ఉండేదాన్ని కదా అని రుద్రాణిపై రేఖ అరుస్తుంది. రాజ్ కి నువ్వు ఇష్టం లేదు కదా అని రుద్రాణి అనగానే ఆ కావ్యని మాత్రం రాజ్ ఇష్టపడి చేసుకున్నాడా అని రేఖ అంటుంది.

ఆ తర్వాత రేఖ డ్రింక్ చేస్తుంటే రాహుల్ తనపై కోప్పడతాడు. అప్పడే రాజ్ వస్తాడు. చూడు రాజ్ బ్రేకప్ అయిందని ఎలా చేస్తుందోనని రాహుల్ అనగానే.. నేను మాట్లాడుతాను నువ్వు వెళ్ళు అని రాహుల్ ని పంపిస్తాడు రాజ్. జరిగింది జరిగిపోయింది మాములుగా ఉండమని రాజ్ సలహా ఇస్తాడు.

మరుసటిరోజు కావ్యని రాజ్ వాకింగ్ చేయిస్తుంటే.. రేఖ చూసి ఓర్వలేకపోతుంది. ఆ తర్వాత కావ్య కోసం రాజ్ జ్యూస్ చేసుకొని తీసుకొని వెళ్తుంటే.. రేఖ ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటుంటుంది. అది రాజ్ చూసి వచ్చి తను ట్యాబ్లెట్ వేసుకోకుండా అపుతాడు. ఏం జరిగిందని రాజ్ అడుగగా..డిప్రెషన్ లో ఉన్నానని రేఖ అంటుంది. మేమందరం ఉన్నాం కదా.. మనుషులతో మాట్లాడమని రేఖతో రాజ్ చెప్తాడు. ఇక రాజ్ చేతిలోని జ్యూస్ చూసిన రేఖ.. బావ ఈ జ్యూస్ నా కోసమేనా అంటూ రాజ్ చేతిలోని జ్యూస్ ని తీసుకొని తాగుతుంది. అదంతా కావ్య చూసి రాజ్ రాగానే ఏంటి జ్యూస్ తనకి ఇచ్చావని అడుగుతుంది.

మరొకవైపు కావ్యకీ టిఫిన్, ట్యాబ్లెట్ ఇవ్వలేదని ఇందిరాదేవి, పనిమనిషి దగ్గరికి వెళ్తుంది. రేఖ అమ్మ ఏదో పాస్తా చేయమంది అని పనిమనిషి చెప్తుంది. అప్పుడే రేఖ వస్తుంది. నీకు నచ్చింది నువ్వు తిను కానీ పనిమనిషిని ఇబ్బంది పెట్టకు.. ముందు కావ్యకి ఫుడ్ పెట్టాలని ఇందిరాదేవి అంటుంది. దాంతో రేఖ కోపంగా బయటకు వెళ్తుంది.

రేఖ దగ్గరికి రాజ్ వెళ్లి నీకు కావాల్సింది పాస్తా కదా అని ఆర్డర్ చేసి ఇస్తాడు. దాంతో నువ్వు ఒక్కడివే బావ నన్ను అర్థం చేసుకుందని రాజ్ ని రేఖ హగ్ చేసుకుంటుంది. రాజ్ వెనక్కి తిరిగి చూసేసరికి కావ్య ఉంటుంది. ఇక కావ్య కోపంగా లోపలికి వెళ్లి ఇందిరాదేవితో మాట్లాడతుంది.

తరువాయి భాగంలో కావ్య కడుపులోని బిడ్డని లేకుండా చెయ్యడానికి రేఖ, రుద్రాణి ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.