English | Telugu

Brahmamudi: అప్పు విషయంలో ధాన్యలక్ష్మి మంచిగా మారుతుందా?

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -912 లో... అప్పు తనకి తెలియకుండా కేసు ఇన్వెస్టిగేషన్ చేసిందని ధాన్యలక్ష్మి కోపంగా ఉంటుంది. సారీ అత్తయ్య నేను చేసింది తప్పేనని ధాన్యలక్ష్మితో అప్పు అంటుంది. నేను క్షమించను.. నన్ను ఇంత మోసం చేస్తారా ఇక నువ్వు ఎప్పుడు పోలీస్ జాబ్ చెయ్యడానికి వీలు లేదని ధాన్యలక్ష్మి చెప్పగానే అప్పు బాధపడుతుంది.

అప్పు తన గదిలోకి వెళ్లి ఏడుస్తుంది. అప్పుడే తన దగ్గరికి కావ్య, రాజ్ వెళ్లి నువ్వు ఆ కేసు గురించి నిర్ణయం తీసుకోవడంలో మా వంతు పాత్ర కూడా ఉంది. అందుకే ఈ ప్రాబ్లమ్ ని మేమే సాల్వ్ చేస్తామని అప్పుతో రాజ్ చెప్తాడు.

ఆ తర్వాత రాజ్ యాడ్ గురించి ప్రమోషన్ చేస్తున్న విషయం ఇంట్లో చెప్తాడు. ఎప్పుడు ఇలా ప్రమోషన్ చెయ్యలేదు కదా ఈసారి ఏంటని సీతారామయ్య అడుగుతాడు. మేం కేరళ వెళ్లడం వల్ల ఆఫీస్ లో కొంత నష్టం వచ్చింది. అందుకేనని కావ్య చెప్తుంది. అలా ప్రమోషన్ కి బదులు రాహుల్ లాగా క్లయింట్ కి డిస్కౌంట్ ఇస్తే సరిపోతుంది కదా అని స్వప్న అనగానే అలా ఏం వద్దని రాజ్ చెప్తాడు. అలా చేస్తే రాహుల్ ని ఫాలో అయినట్లు ఉంటుందని అనుకుంటున్నాడని రుద్రాణి అంటుంది. అదేం కాదు రాహుల్ లా ఒకసారి చేస్తే ప్రతిసారీ అలాగే చెయ్యాలి లేదంటే నమ్మకం పోతుందని రాజ్ అంటాడు.

మరొకవైపు ధాన్యలక్ష్మి, అప్పుకి టిఫిన్ ఇస్తుంది. ఇది అయిన నేను చెప్పినట్టు చేస్తావా లేక నీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. ఆ రోజు నేను వచ్చినప్పుడు బెడ్ పై పడుకుంది ఎవరని ధాన్యలక్ష్మి అడుగగా మావయ్య అని అప్పు చెప్తుంది. ఇందులో ఆయన భాగం కూడా ఉందా అని ధాన్యలక్ష్మి అంటుంది. అదంతా రాజ్, కావ్య, ఇందిరాదేవి విని ముగ్గురు కలిసి ఒక ప్లాన్ చేస్తారు.

ఎప్పుడూ అన్నదానం జరిపించే పంతులు ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తాడు. అతనికి డబ్బులు ఇచ్చి ఈ నెల అన్నదానం చెయ్యమని చెప్తుంటే.. వద్దని ఇందిరాదేవి ఆపుతుంది. ఎందుకు అత్తయ్య నేను చేసేది మంచి పనే కదా అని ధాన్యలక్ష్మి అంటుంది. నువ్వు చేసేది మంచి పని అయితే మాత్రం నాకు నచ్చనవసరం లేదా అని ఇందిరాదేవి అంటుంది. అవసరం లేదని ధాన్యలక్ష్మి అనగానే నీ కోడలు విషయంలో అలా ఎందుకు ఆలోచించడం లేదు.. తను చేసింది మంచి పనే కదా అని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.