English | Telugu

Brahmamudi: రాహుల్ కి ఎక్సలెన్స్ అవార్డు.. డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -903 లో... కావ్యకి ఇక ఏ ప్రాబ్లెమ్ లేదని ఆయుర్వేద వైద్యం చేసిన అతను చెప్తాడు. దాంతో రాజ్, కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.

మరొకవైపు సుభాష్ దగ్గరికి అపర్ణ వచ్చి మాట్లాడుతుంది. ఎన్నడూ లేని విధంగా ఎందుకు ఇంత కోపంగా ఉన్నారని అడుగుతుంది. ఎందుకంటే మన కంపెనీకి పది కోట్లు నష్టం వచ్చిందని సుభాష్ అంటాడు. కానీ రాహుల్ ఆ డిజైన్స్ తియ్యలేదు అంటున్నాడు.. పైగా స్వప్న కూడ సపోర్ట్ చేస్తుంది. తెలుసుకుంటా అన్నీ తెలుసుకుంటానని సుభాష్ అంటాడు.

మరొకవైపు ఇంట్లో పనిమనిషికి కావ్య రిపోర్ట్స్ కన్పిస్తాయి. అవి చూసి రుద్రాణి షాక్ అవుతుంది.. అంటే కావ్యకి ప్రాబ్లమ్ ఇంకా ఉంది అన్నమాట అనుకుని హాల్లో ఉన్న అందరికి రిపోర్ట్స్ చూపిస్తుంది. అవి సుభాష్ చూసి షాక్ అవుతాడు. ఏమైందని అపర్ణ అడుగగా మనకి కావ్య ప్రాబ్లమ్ తగ్గిపోయిందన్నారు కానీ తగ్గలేదని చెప్పగానే అందరు షాక్ అవుతారు.

అప్పుడే రాజ్, కావ్య ఎంట్రీ ఇస్తారు. మమ్మల్ని ఎందుకు ఇంత మోసం చేసారని అపర్ణ కోప్పడుతుంది. మా దగ్గర ఎందుకు నిజం దాచారని అడుగుతుంది. కావ్యకి తన కడుపులో పెరుగుతున్న బేబీని చంపుకోవడం ఇష్టం లేదు.. అందుకే ఇలా.. కానీ దీనికి పరిష్కారం దొరికింది.. గుళ్లో పంతులు కావ్య సమస్య విని కేరళలో ఆయుర్వేద వైద్యం చేయించమని చెప్పారు.. దాంతో క్షణం ఆలస్యం చేయకుండా మీతో టూర్ కి వెళ్తున్నామని చెప్పి వెళ్లిపోయామని రాజ్ అంటాడు. అక్కడ వైద్యం చేసి కావ్యకి ప్రాబ్లమ్ లేదని చెప్పారనగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు.

తరువాయి భాగంలో రాహుల్ కి ఎక్సలెన్స్ అవార్డు వస్తుంది. రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.