Read more!

English | Telugu

భర్త నడుము మీద పుట్టుమచ్చ లేదని కనిపెట్టేసిన భార్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -377 లో....కావ్య దగ్గరికి ఇందిరాదేవి వస్తుంది. నువ్వు వెళ్లిన పని ఏమైంది.. ఆ బాబు తల్లిని తీసుకొని రావాలని చూస్తున్నవ్ కానీ వస్తే ఇంట్లో నీ పరిస్థితేంటో అర్థం చేసుకున్నావా అని ఇందిరాదేవి అడుగుతుంది. ఆ పరిస్థితి రాదని నా మనసు చెప్తుందని కావ్య అంటుంది. మరొకవైపు కళ్యాణ్ తో‌ నువ్వు ఎందుకు బయటకు వెళ్ళావ్? అలా అని తప్పు పట్టలేను అని అప్పుతో కృష్ణమూర్తి అంటాడు.

ఆ తర్వాత నా కూతురు తప్పు చెయ్యనంత వరకు ఎవరికీ భయపడదు. నీకు నచ్చింది నువ్వు చేసుకొ అమ్మ ఎవరు అడుగుతారో నేను చూస్తానంటూ అప్పుకి కనకం చెప్తుంది. ధాన్యలక్ష్మి అయిన ఆ కుటుంబ అయినా ఏమైనా అంటే వాళ్ళ సంగతి నేను చెప్తానని కనకం అంటుంది. మీరు కంగారుపడకండి నాన్న.. అమ్మ ఏదో చెప్పిందని.. నా ఇష్టానికి ఏదీ చెయ్యను. మిమ్మల్ని బాధపెట్టనని కృష్ణమూర్తితో అప్పు అంటుంది. ఆ తర్వాత బాబుకి కావ్య స్నానం చేయించి బట్టలు వేస్తుంటే.. రుద్రాణి వచ్చి రాజ్ లాగే బాబు కూడా చాలా బాగున్నాడని రాజ్ పోలికలేనని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత రాజ్ నడుమ్ కి ఉన్న పుట్టుమచ్చ రుద్రాణి చూసి.. సేమ్ రాజ్ కి కూడా అలాగే ఉందని రుద్రాణి అంటుంది. నిజంగానే ఈ బాబు ఆయన బాబేనా అని కావ్య ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత రాజ్ దగ్గరికి కావ్య వచ్చి.. నడుంకి పుట్టుమచ్చ ఉందో లేదో చూడడానికి ట్రై చేస్తుంటే.. ఏం చేస్తున్నావ్ నా నడుం ఎందుకు చూసున్నావంటు రాజ్ అడుగుతాడు. చూస్తే ఏమైందంటూ కావ్య దబాయిస్తుంది.

ఆ తర్వాత అనామిక దగ్గరికి రుద్రాణి వచ్చి.. నువ్వు కోపంగా ఉంటావని తెలుసు కానీ కళ్యాణ్ నీకు నచ్చినట్టు ఉండాలంటే కొంచెం ప్రేమగా ఉండని అనామికకి రుద్రాణి చెప్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ గదిలోకి రాగానే అనామిక ప్రేమగా మాట్లాడాలని ట్రై చేస్తుంది కానీ కళ్యాణ్ పట్టించుకోడు. ఆ తర్వాత రాజ్ పడుకున్నాక బొద్దింక దూరిందని కావ్య కవర్ చేస్తూ రాజ్ నడుంకి మచ్చ ఉందో లేదో చూస్తుంది. తీరా చూస్తా రాజ్ కి నడుం దగ్గర పుట్టుమచ్చ ఉండదు. ఆ తర్వాత రాజ్ పడుకుంటూ పుట్టుమచ్చ లేనంత మాత్రాన.. బాబు నా బాబు కాకుండా పోడని రాజ్ అనగానే.. కావ్య ఆశ్చర్యపోతుంది. తరువాయి భాగంలో కళ్యాణ్ కి భాద్యతలు ఇస్తున్నట్లు రాజ్ చెప్పగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.