Read more!

English | Telugu

Brahmamudi : అనామిక గొప్పలు బయటపెట్టిన కళ్యాణ్.. ఫ్రెండ్స్ ముందు పరువుపోయిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్  సోమవారం నాటి ఎపిసోడ్ -360 లో.. అనామిక ఫ్రెండ్స్ అంతా దుగ్గిరాల వారి ఇంటికి వస్తారు. కళ్యాణ్ మొత్తం బిజినెస్ లు అన్ని చూసుకుంటాడని వాళ్ళ  ఫ్రెండ్స్ కి చెప్తూ బిల్డప్ ఇస్తుంది అనామిక. ఆ తర్వాత అందరిని తన ఫ్రెండ్స్ కి పరిచయం చేస్తుంది. కావ్య, అపర్ణలని తనను వాళ్లకి పరిచయం చేస్తుంది. మీ హస్బెండ్ ఏం చేస్తారు అని కావ్యని అనామిక ఫ్రెండ్స్ అడుగుతారు. మా హస్బెండ్ కి హెల్ప్ చేస్తుంటాడని అనామిక చెప్పగానే.. ఇంట్లో వాళ్ళు షాక్ అవుతారు.

ఆ తర్వాత మీ హస్బెండ్ ని పరిచయం చెయ్ అని అనామిక ఫ్రెండ్స్ అడుగగా.. తను చాలా బిజీ అని చెప్తుంది. అప్పుడే కళ్యాణ్ వస్తాడు. మీరు చాలా గ్రేట్ అంత బిజీలో కూడా భార్యతో టైమ్ స్పెండ్ చేస్తారని అనామిక వాళ్ళ ఫ్రెండ్స్ అనగానే.. మీకు ఎవరు చెప్పారో గానీ నేనేం బిజినెస్ చూసుకోను, నేను రైటర్ ని మాత్రమే అని కళ్యాణ్ అంటాడు. మీ ఫ్రెండ్ మీ ముందు గొప్పలు చెప్పిందేమో అర్థం చేసుకోండి అని కళ్యాణ్ అంటాడు. నువ్వు ఇలా ఎందుకు అబద్ధం చెప్పావ్.. నువ్వు మారావని అనుకున్నాం కానీ ఇంకా అలాగే ఉన్నావ్ మంచి ఫ్యామిలీ దొరికింది.. ఇప్పటికైనా మారమని తన ఫ్రెండ్స్ అనామికతో చెప్పి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కళ్యాణ్ దగ్గరికి అనామిక వెళ్లి.. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు.. నా ఫ్రెండ్స్ ముందు నా పరువుపోయింది.. నువ్వు గొప్పగా ఉంటే నా ఫ్రెండ్స్ ముందు గొప్పగా చెప్పేదాన్ని అని అనామిక అంటుంది. నాకు టైమ్ పడుతుంది అని కళ్యాణ్ అంటాడు. ఎంత టైమ్ పడుతుంది చెప్పు వెయిట్ చేస్తాను.. వన్ వీక్ లో ఒక అవకాశం అయిన తెచ్చుకోమని కళ్యాణ్ తో అనామిక అంటుంది. తెచ్చుకుంటానని కళ్యాణ్ అనగానే.. చూస్తాను తెచ్చుకోకపోతే నేను చెప్పింది చేయాలి దానికి మీ అమ్మ సాక్ష్యమని అనామిక అనగానే కళ్యాణ్ సరే అంటాడు.

ఆ తర్వాత రాజ్ ఇంటికి వచ్చాక.. రేపు మీ పెళ్లి రోజు కదా సెలబ్రేషన్స్ చేయాలని ఇందిరాదేవి అనగానే.. ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు. నేను నా జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటాను కావ్య పేరెంట్స్ ఉండాలని రాజ్ చెప్తాడు. అది ఏంటోనని రాజ్ ని కావ్య అడుగుతుంది. మరుసటిరోజు ఉదయం కావ్య, రాజ్ లతో పూజ జరిపించాలని ఇందిరాదేవి అనగానే.. ఎందుకు? వద్దని అపర్ణ అంటుంది. తను అసలు కావ్యని కోడలిగా అంగీకరించలేదని రుద్రాణి, ధాన్యలక్ష్మి  అంటారు. తరువాయి భాగంలో కావ్య, రాజ్ ఇద్దరు పూజ చేస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.