Read more!

English | Telugu

Brahmamudi : కొడుకు దోషి కాదంట.. ఆ నిజాన్ని బయటపెడతానన్న నాన్న!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -388 లో.. అందరు హాల్లో కూర్చొని ఉంటారు. కావ్య గుడికి వెళ్లడంతో వాళ్ళకి టీ ఎవరు ఇవ్వలేదు. నీ కోడలిని టీ పెట్టమని చెప్పొచ్చు కదా అని ధాన్యలక్ష్మితో రుద్రాణి అంటుంది. మరి నీ కోడలిని పెట్టమని చెప్పొచ్చు కదా అని రుద్రాణితో ధాన్యలక్ష్మి అంటుంది.. ఎవరికి అవసరం అయితే వాళ్ళు పెట్టుకొని తాగండి అని స్వప్న అందరికి చురకలు అంటిస్తుంది. ఆ తర్వాత బాబు ఏడుస్తుంటే అందరు ఎందుకో ఏడుస్తున్నారని అనుకుంటారు.

ఆ తర్వాత బాబు ఏడుస్తుంటే ఎవరు వెళ్లట్లేదు ఇందిరాదేవి వెళ్తుంటే.. నేను వెళ్తానని స్వప్న వెళ్తుంటుంది. అప్పుడే కావ్య వస్తుంది. బాబు చాలా సేపటినుండి ఏడుస్తున్నాడు త్వరగా వెళ్లి ఏమైందో చూడమని స్వప్న అంటుంది. ఆ తర్వాత కావ్య వెళ్లి రాజ్ దగ్గర ఉన్న బాబుని తీసుకొని ఏమైంది? ఎందుకు అలా ఏడుస్తున్నాడని అడుగుతుంది. ఏమో తెలియదని రాజ్ అంటాడు. ఇక రాజ్, కావ్య హాస్పిటల్ కి వెళదామని కిందకి వస్తారు. అందరు ఏమైందంటూ దగ్గరికి వెళ్తారు. చాలా జ్వరంగా ఉందని చెప్తుంది. పదండి హాస్పిటల్ కి వెళదామని సుభాష్ అనగానే.. వదిన ఎవరిని సాయం చెయ్యొద్దని చెప్పింది కదా అని రుద్రాణి అంటుంది. సాయం వద్దు అంది. కేవలం రాజ్ కి మాత్రమే బాబుకి కాదని అపర్ణ అనగానే.. రాజ్ ,కావ్య, సుభాష్ లు బాబుని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. హాస్పిటల్ కి వెళ్ళాక బాబుకి అన్ని టెస్ట్ లు చేసి చెప్తామని డాక్టర్ చెప్తుంది.

ఆ తర్వాత బాబుకి ఏమైనా అయితే వాళ్ళ అమ్మకేం సమాధానం చెప్తాం. వాళ్ళ అమ్మ వచ్చి దుగ్గిరాల కుటుంబం.. నా బాబుని ఇలా చేశారని కేసు వేస్తే పరిస్థితి ఏంటని రుద్రాణి అంటుంది. దాంతో తనపై ఇందిరాదేవి కోప్పడుతుంది. బాబు బాగుండాలి. ఆ తర్వాత అసలు నిజం రాజ్ ని నీలదియ్యాలని అపర్ణ అంటుంది. మరొకవైపు హాస్పిటల్ లో అన్ని టెస్ట్ లు చేసి.. రిపోర్ట్స్ నార్మల్ అని డాక్టర్ చెప్తుంది. మరి మీరు పాలు ఇస్తున్నారా అని కావ్యని డాక్టర్ అడుగుతుంది.‌ నేను కన్నతల్లిని కాదని కావ్య అనగానే.. అది విషయం.. బాబుకి కన్నతల్లి స్పర్శ కావాలి, అందుకే ఇలా ఏడుస్తున్నాడని.. త్వరగా బాబుని తల్లి దగ్గరకి పంపండని డాక్టర్ చెప్తుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక.. ఈ విషయం ఇంట్లోవాళ్లకి కావ్య చెప్తుంది. ఇప్పటికైన ఆ బాబుని తల్లి దగ్గరికి పంపించు.. నిజం చెప్పమని అందరు అడుగుతారు. నేను ఇప్పుడు ఏం చెప్పలేనని రాజ్ అనగానే.. అయితే నేనే ఒక నిర్ణయం తీసుకున్నానని అపర్ణ అంటుంది. తరువాయి భాగంలో రాజ్ వెళ్తున్న కార్ కి అడ్డుగా సుభాష్ వెళ్లి.. అందరు నా కొడుకుని దోషి అంటుంటే నేను చూడలేకపోతున్నాను.. ఆ నిజం ఏదో నేనే బయటపెడతానని సుభాష్ అంటాడు. అదంతా చాటు నుండి కావ్య విని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.