Read more!

English | Telugu

కమెడియన్ భద్రంకి పిచ్చిపట్టింది... తినకపోతే కారిపోతాది!

 

సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి "ప్రసన్న వదనం" మూవీ టీమ్ వచ్చింది. ఇందులో సుహాస్, కమెడియన్ భద్రం, శరణ్య, రాశి వచ్చారు. అసలే సమ్మర్. వేడి సెగలు కొట్టేస్తోంది. ఇలాంటి టైంలో టైం ఆ వేడి తెలియకుండా ఉండడానికి సుమ వచ్చిన వాళ్లకు పుల్లైసు ఇచ్చింది. శరణ్య, రాశి ఇద్దరూ మాంగో ఐస్ తింటూ కనిపించారు. "మీకు ఈ పుల్లైసు తింటుంటే ఏమనిపిస్తోంది" అని సుమ అడిగేసరికి "తినకపోతే కారిపోతాది అనిపిస్తోంది" అంటూ శరణ్య జోక్ వేసింది. "జీవితం కూడా పుల్లైసు లాంటిదే. అందుకే అది కారిపోక ముందే మనం తినేయాలి. మనకు బతుకు ఉన్నప్పుడే బతికేయాలి " అని సుమ జీవిత సత్యం చెప్పింది.

 "అబ్బాయిలకన్నా అమ్మాయిలు ఎక్కువగా స్టడీ మీద ఎందుకు ఫోకస్ చేస్తారు" అని సుమ అడిగేసరికి "అబ్బాయిలు అమ్మాయిల మీద ఫోకస్ చేస్తారు కాబట్టి" అని సుహాస్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు. "ఒక్కసారి వచ్చిన యవ్వనం ఎవరికైనా వెళ్ళిపోతుంది కానీ నాకు అలానే ఉండిపోయింది" అంటూ తన మీద తానే జోక్ వేసుకుని నవ్వు తెప్పిద్దామనుకుంది సుమ.

తర్వాత సుమ ఒక పిచ్చాసుపత్రి నడుపుతూ ఉంటుంది. ఆమె దగ్గరకు కమెడియన్ భద్రం వచ్చి రకరకాల ప్రశ్నలు వేస్తుంటాడు. అతని వెంటే సుహాస్ వచ్చి "ఏంటి ఇక్కడికి వచ్చేసావా.. ఎంత చెప్పినా వినట్లేదండి..బాహుబలిలో హీరో అని అంటున్నాడు. సలార్ కూడా తానే చేశానంటున్నాడు" అని చెప్పేసరికి "ఏంటి బాహుబలిలో హీరో నువ్వా" అని భద్రంని సుమ అడిగేసింది. ఇలా ఈ టీమ్ తో ఎన్నో గేమ్స్ ఆడించింది సుమ.