English | Telugu

స్టేజ్ మీదే 'జబర్దస్త్' కమెడియన్ పై దాడి!

బుల్లితెర కామెడీ షోలలో 'జబర్దస్త్' టాప్ రేసులో దూసుకుపోతోంది. ఈ షో ద్వారా వెలుగులోకి వచ్చిన కమెడియన్లలో వెంకీ ఒకరు. అమ్మాయిలను వేధిస్తున్నాడనే ఆరోపణలతో వెంకీను స్టేజ్ మీదే కొట్టడానికి కొందరు ప్రయత్నించడం హాట్ టాపిక్‌గా మారింది. మిమిక్రీ, వెంట్రిలాక్విజం ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన వెంకీ.. ఎన్నో ఈవెంట్‌లలో తన కామెడీతో ఆకట్టుకున్నాడు.

తన టాలెంట్ తో 'జబర్దస్త్' షోలో ఛాన్స్ కొట్టేశాడు. అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. టీమ్ లీడర్‌గా ఎదిగాడు. ఇదిలా ఉండగా.. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ఇటీవల 'రెచ్చిపోదాం బ్రదర్' అనే షోను మొదలుపెట్టారు. దీనికి నటుడు రాజీవ్ కనకాల జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో కమెడియన్స్ తో పాటు స్టూడెంట్స్ కూడా రచ్చ చేస్తున్నారు.

తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో ఓ అమ్మాయిని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ.. కొందరు వెంకీ కోసం ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. రాజీవ్ కనకాల ముందే వాళ్లంతా గొడవకు దిగారు. వాళ్లతో పాటు సదరు యువతి కూడా అక్కడకు వచ్చింది. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు వెంకీపై దాడికి దిగినట్లు కనిపిస్తోంది. దీంతో ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది. ఇదంతా నిజమో..? లేక మల్లెమాల పబ్లిసిటీలో భాగమో తెలియాల్సి వుంది!

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.