Read more!

English | Telugu

రానా దగ్గుబాటి కల్లు దావత్ తో అనిల్ జీలా పరేషాన్!

అనిల్ జీలా.. మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా మోస్ట్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఈ మై విలేజ్ షోలో నటించినవాళ్ళు ఇప్పుడు సినిమా ఆఫర్లతో బిజీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఇందులో చేసిన గంగవ్వకి బిగ్ బాస్ పిలిచి అవకాశం ఇచ్చారు. హోస్ట్ గా చేస్తున్న నాగార్జున అవ్వ అని ముద్దుగా పిలవడంతో 'గంగవ్వ' మరింత ఫేమస్ అయింది. ఇక గంగవ్వ నటించిన 'మై విలేజ్ షో' మస్త్ పాపులారిటి పొందింది. ఇలా ఈ యూట్యూబ్ ఛానెల్ ఫేమస్ అవ్వడంతో ఇంకా చాలా యూట్యూబ్ ఛానెల్స్ కొత్తగా మొదలయ్యాయి. అనిల్ జీలా, తిరుమల్ కలిసి 'కల్లి వెల్లి' అనే మరో కొత్త ఛానెల్ ని కూడా స్టార్ట్ చేసారు. దీనిలో ప్రతీవారం కొందరు సెలబ్రిటీలని పిలిచి అనిల్ జీలా ధావత్ చేస్తున్నాడు. 

మై విలేజ్ షో ని లీడ్ చేస్తున్న అనిల్ జీలా తన మ్యారేజ్ కి చేసిన ఒక వినూత్నమైన ఆలోచన కరోనా టైంలో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే గతవారం అనిల్ జీలా విష్ణుప్రియ, మానస్ లని ధావత్ కి పిలిచాడు. ఇప్పుడేమో 'పరేషాన్' సినిమాలో నటించిన హీరో తిరువీర్, పావనిలని ధావత్ కి పిలిచాడు. దాంతో వీళ్ళు తెలంగాణ మొత్తం పబ్లిసిటీ అవుతుందని భావించి ప్రమోషన్స్ కోసం వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన హీరో హీరోయిన్లకి కల్లు అంటే ఏంటో తెలియజేసి వారిచేత తాగించాడు అనిల్ జీలా. అయితే పరేషాన్ మూవీని ప్రొడ్యూస్ చేసిన రానా దగ్గుబాటి కూడా ఈ ధావత్ కి అటెండ్ అయ్యాడు. ఇక్కడికి వచ్చాక కల్లు తాగిన రానాని ఎలా ఉందన్నా? కిక్కు ఎక్కిందా అని అనిల్ జీలా అడిగితే.. నాకు ఎక్కడానికి ఇంకా టైం పడుతుందని చెప్పాడు రానా. 

ఆ తర్వాత గంగవ్వ పరేషాన్ సినిమా విశేషాలు అడుగగా.. ఇది ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చింది.‌ ఈ సినిమాలో నన్ను నేను చూసుకున్నానని రానా చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తను మద్రాస్ లో పుట్టానని, హైదరాబాద్, బేగంపేట్ దాటి పోలేదని.. ఈ తెలంగాణ లైఫ్ స్టైల్ ఎక్కువ తెలియదని ఈ సినిమా ప్రొడ్యూస్ చేసాక తెలిసింది‌‌.. ఇదొక కొత్త ప్రపంచమని అని రానా చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత సినిమాలోని ఒక పాటని అందరూ కలిసి పాడారు. కోడికూర తింటూ తాటి కల్లు తాగుతూ అందరూ ఎంజాయ్ చేసారు. పరేషాన్ మూవీ సక్సెస్ అవుతుందని మీరు పరేషాన్ కాకండని అనిల్ జీలా చెప్పాడు.