Read more!

English | Telugu

ముద్దులే ముద్దులు...కాబోయే భర్తపై రష్మీ క్లారిటీ

శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రతీ వారం సరికొత్తగా అలరిస్తూ వస్తోంది. ఇక ఈ వారం ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎంచుకున్న కాన్సెప్ట్ 'వింటర్ హనీమూన్ కాంటెస్ట్'.  రాబోయే ఎపిసోడ్ లో రష్మీ, హైపర్ ఆది, నరేష్ ఇతర కమెడియన్లు ఎప్పటిలాగే తమ పంచ్ డైలాగ్స్ తో ఎంటర్టైన్ చేశారు. ఈ ఎపిసోడ్ లో   రియల్ లైఫ్ కపుల్స్ పార్టిసిపేట్ చేసి రొమాన్స్ చేశారు. వాళ్ళల్లో డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ కపుల్ కూడా ఉన్నారు.

ఇంకొంతమంది డాన్స్ మాస్టర్స్ తమ తమ బెటర్ హాఫ్స్ తో  వచ్చారు.  రొమాంటిక్ కపుల్స్ తో దగ్గర ఉండి హనీమూన్ స్కిట్స్ చేయించారు హైపర్ ఆది, రష్మీ. రొమాన్స్ చేస్తున్న జంటలపై  ఆది కామెడీ పంచ్ లు వేయడం.. జడ్జి ఇంద్రజ.. "రియల్ కపుల్ రొమాన్స్ చేస్తే ఆ కిక్కే వేరు" అని కామెంట్ చేయడం ఆకట్టుకుంది.  ఇక కపుల్స్ మధ్యలో యాంకర్ రష్మి అలాగే హైపర్ ఆది ఇద్దరూ ఒక పేపర్ వేసి పెదాలతో ఆ కాగితాన్ని  పట్టుకోమని పోటీ పెట్టారు. ఇక సెలబ్రిటీ జంటలు గేమ్ ఆడుతూ ఉంటే మధ్యలో "పేపర్ ఆగినా నువ్వు ఆగేలా లేవు" అంటూ అర్జున్ అంబటి మీద హైపర్ ఆది పంచ్ వేసాడు. ఆ పేపర్ మిస్ అయ్యేసరికి  ఒకరినొకరు ముద్దులు కూడా పెట్టేసుకున్నారు. ఆది పక్కన ఉన్న లేడీ కమెడియన్ "ఈ చలిలో నాకు పెదాలు పగిలిపోతున్నాయి, చేతులు పగిలిపోతున్నాయి..నువ్వు పట్టించుకోవడం లేదు" అనేసరికి "నువ్వు పగిలిపోవడం గురించి ఆలోచిస్తున్నావు, కానీ ఇక్కడ రగిలిపోవడం గురించి నువ్వు ఆలోచించట్లేదు" అనేసరికి అందరూ నవ్వేశారు.

ఇక సింగర్ గణేష్ సాంగ్ పాడి అందరినీ అలరించాడు. కేరళ అమ్మాయి గెటప్ తో నాటీ నరేష్ వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఎపిసోడ్ లో రష్మీ పెళ్లి విషయం మళ్ళీ హైలైట్ అయ్యింది. రష్మీ పెళ్ళికి సంబంధించిన ఒక ఫోటోను స్క్రీన్ మీద చూపించారు. రష్మీ పక్కన ముఖం కనిపించకుండా కూర్చున్న అబ్బాయి గురించి అడిగారు. అందుకు రష్మీ ఎవరు, ఎప్పుడు వస్తున్నారంటే అంటూ క్లియర్ గా ఆన్సర్ చెప్పకుండా సస్పెన్స్ క్రియేట్ చేసింది.