Read more!

English | Telugu

ఎండిపోయిన నీ సహజ నైజాన్ని నువ్వు మరువకు.. వర్త్ వర్మ వర్త్!

మనిషికి ప్రకృతికి ఒక విడదీయరాని అనుబంధం ఉంది. చెట్లు , పూలు, పండ్లు అన్నీ కూడా మనిషి జీవన శైలికి అనుగుణంగా పెరుగుతుంటాయి. అదేసమయంలో మనిషి మాత్రం తన సహజ గుణాన్ని మర్చిపోయి కృత్రిమ పోకడలకి అలవాటు పడిపోతున్నాడు. అదే విషయాన్ని చెప్తూ యాంకర్ ఝాన్సీ ఓ వీడియోని తన ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేసింది.

అసలేం ఉంది ఆ వీడియోలో.. ఏమ చెప్పిందో ఓసారి చూసేద్దాం.. వారం రోజుల క్రితం ఝాన్సీ చేసిన ఓ పొగడపూల మాలని చూపిస్తూ.. ఎండిపోయిన కూడా ఇంకా షేప్ ఏ మాత్రం మారలేదు. పైగా అదే సువాసనతో చాలా చక్కగా ఉంది. ఎండిపోవడం సహజం.. కానీ నువ్వు ఎండిపోయిన కూడా నీ సహజ నైజాన్ని నువ్వు మర్చిపోకపోతే .. ఎండిపోయిన తర్వాత కూడా నీ వాల్యూ ఏం తగ్గదు.. వర్త్ వర్మ వర్త్.. అంటూ ఝాన్సీ చెప్పింది. అయితే తనెందుకు ఇలా చెప్పిందంటే మనిషి వయసు అయిపోతున్నా కానీ తన సహజ నైజాన్ని మర్చిపోకూడదని.. అదే విషయాన్ని చెప్తూ.. "వయసైపోయిందని ఎగతాళి చేసే వెదవలకి ఇదో గుణపాఠం " అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

యాంకర్ ఝాన్సీ గురించి అందరికీ తెలుసు. ఆమె బుల్లితెర యాంకర్‌గా ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అలాగే ఎన్నో మూవీస్ లో కూడా నటించింది.  ఇక ఆమె సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. కొంతకాలం క్రితం రిలీజైన సలార్ లో ఆమె ఓబులమ్మగా నటించి మెప్పించారు. ఆ తర్వాత డిస్నీ ప్లస్  హాట్ స్టార్ లో రిలీజైన మిస్ పర్ ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఇక తను ఇన్ స్టాగ్రామ్ లో  301K ఫాలోవర్స్ ని కలిగి ఉంది. తను‌ ఎన్నో సినిమాల్లో నటించింది. అయితే మొదట 'సొంతం' మూవీలో సునీల్ తో‌ కలిసి చేసిన ఆ కామెడీ వీడియోలు, మాటలు, పంచ్ లు అన్నీ ఇప్పటికీ ఇన్ స్టాగ్రామ్ లో మీమ్స్ లో కన్పిస్తుంటాయి. అయితే ఝాన్సీ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వినూత్నమైన పోస్ట్ ని మీరు చూశారా కామెంట్ చేయండి.