Read more!

English | Telugu

నాలో కొత్త భావాలు పుట్టుకొస్తున్నాయి అంటున్న అనసూయ!

యాంకర్ అనసూయ ఈమధ్య షాప్ ఓపెనింగ్స్ తో ఫోటో షూట్స్ తో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్ ని ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. అందులో చాలా క్యూట్ గా, హాట్ గా కనిపిస్తోంది. ''శుభ సూచనలు, కొత్త భావాలు, పాత కోరికలు, అదే హృదయం'' అని పోస్ట్ పెట్టారు. అనసూయకు వస్తున్న కొత్త ఆలోచనలు ఏమో కానీ ఆమె ఫొటోస్ చూసి స్టన్నింగ్ లుక్స్ కి నెటిజన్స్ ఫిదా ఐపోయి కామెంట్స్ పెడుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న అందంతో ఆమెకు  సిల్వర్ స్క్రీన్ మీద  ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలే ఆమెకు వస్తున్నాయి. దాంతో అనసూయ తనలోని మరో కోణాన్ని ఆడియన్స్ కి చూపిస్తోంది. తనకు కావాల్సింది కూడా ఇదే అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 

పుష్ప, ఖిలాడి, దర్జా చిత్రాల్లో  ఆమె నెగిటివ్ రోల్స్ చేశారు. సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ మైఖేల్ లో అనసూయ ఓ మెయిన్ రోల్ చేస్తోంది. పుష్ప 2లో మరోసారి ఆమె దాక్షాయణిగా విలన్ గా కనిపించనున్నారు.  సిల్వర్ స్క్రీన్ పై బిజీ అయ్యేసరికి యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసింది. ఇక ఆమెకు వేరే లాంగ్వేజెస్ లో నటించే ఆఫర్స్  కూడా వస్తున్నాయి. గత ఏడాది అనసూయ ఒక తమిళ, మలయాళ చిత్రం చేశారు. లైఫ్ లో ఎప్పుడూ బెటర్మెంట్ కోసం అనసూయ కసరత్తు చేస్తూనే ఉంటుంది. అలా ఇప్పుడు నటన వైపు అడుగులు వేస్తోంది. అల్లు అర్జున్-సుకుమార్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ పుష్ప 2  లో ఈమె కనిపించబోతోంది అలాగే డైరెక్టర్  కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండలో కీలక రోల్ లో నటించింది.