Read more!

English | Telugu

ట్విట్టర్ లో మళ్లీ అనసూయ రచ్చ... ముదిరిన గొడవ!

అనసూయ భరద్వాజ్.. అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై తన యాక్టింగ్ తో, యాంకరింగ్ తో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర తనకి ఎంతగా పేరు తెచ్చిందో అందరికి తెలిసిందే. అయితే అటు సినిమాలలో బిజీగా ఉంటూనే వీకెండ్ లో ఫ్యామిలీతో గడుపుతుంటుంది ఈ భామ.

అయితే కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో తనని ఎవరో ఆంటీ అన్నారని.. దానికి తీవ్రంగా స్పందించింది అనసూయ. దాని తర్వాత అనసూయ కొంతకాలంగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ వస్తోంది. అయితే తాజాగా తన కొత్త సినిమా 'విమానం' ప్రమోషన్స్ లో భాగంగా ఒక పోస్టర్ పెట్టి.. వెయిటింగ్ అని పెట్టింది. అయితే అక్కడ వరకు బానే ఉంది. తాజాగా విజయ్ దేవరకొండ కొత్త సినిమా 'ఖుషి' పోస్టర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. దానిని విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అయితే అందులో విజయ్ పేరుకి ముందు 'The' అని ఉంది. అంటే The Vijay Devarakonda.. అని ఉంది. ఆ విషయాన్ని టార్గెట్ చేస్తూ అనసూయ తన ట్విట్టర్ లో పరోక్షంగా ఒక పోస్ట్ చేసింది. పేరు ముందు 'THE' చూశాను.. అదేం పైత్యమో.. మనకెందుకు అంటకుండా చూసుకుందామని అనసూయ ట్వీట్ చేసింది. ఇక అక్కడితో మొదలైంది ఈ రచ్చ. 

అనసూయ ట్వీట్ ని చూసిన విజయ్ దేవరకొండ అభిమానులు.. అనసూయని ట్యాగ్ చేస్తూ.. తనని తిట్టుకుంటూ వరుసగా ట్వీట్లు చేయడం స్డార్ట్ చేసారు. అయితే అనసూయ తనని తిట్టిన వాళ్ళందరి పోస్ట్ లను చూస్తూ.. వాటికి తగ్గట్టు కౌంటర్ వేస్తూ ట్వీట్లు చేస్తుంది. అయితే తాజాగా మరొక ట్వీట్ చేసింది అనసూయ. ఎంతమంది చేసినా తప్పు తప్పే అవుతుంది.. ఒక్కరే చేసినంత మాత్రాన ఒప్పు ఒప్పుకోకుండా పోదు అని ఒక ట్వీట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ చూసిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మళ్ళీ తనపై రీట్వీట్ లు చేస్తూ, అనసూయని తిడుతూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ పోస్ట్ లకి ఇప్పటివరకు విజయ్ దేవరకొండ మాత్రం స్పందించలేదు. ప్రస్తుతం ఈ వివాదం వైరల్ గా మారింది. కాగా అనసూయ, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ మాటల యుద్ధం ఎప్పటివరకు సాగుతుందో చూడాలి మరి!