Read more!

English | Telugu

బిగ్ బాస్ సీజన్ 8లో అమృత ప్రణయ్!

బిగ్ బాస్ తెలుగు ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఎనిమిదో సీజన్లోకి అడుగుపెట్టనుంది. ఈ కంటెస్టెంట్స్ లిస్ట్ లో కొన్ని కొత్త పేర్లు వినిపిస్తున్నాయి.

తాజాగా నీతోనే డ్యాన్స్ షో, ఢీ షో లోని కొంతమందిని బిబి టీమ్ అప్రోచ్ అయినట్టు తెలుస్తోంది. వీరితో పాటు అమృత ప్రణయ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. జనరల్ గా ఇలా రెండు పేర్లు కలిసి ఉన్నప్పుడు అమ్మాయా? లేక అబ్బాయా అనే సందేహం అందరిలోను వస్తుంది. అయితే తను అమ్మాయే.. అమృత. అప్పట్లో సోషల్ మీడియాలో పరువు హత్యతో ఫేమస్ అయిన అమృతని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారంట బిబి టీమ్. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో 2018 సెప్టెంబర్ 14వ తేదీన జరిగిన ప్రణయ్ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మిర్యాలగూడకు రియల్ వ్యాపారి మారుతీ రావు కూతురు అమృత, ఇదే పట్టణానికి చెందిన దళితుడు ప్రణయ్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కులాంతర వివాహాన్ని అంగీకరించని మారుతీ రావు.. ప్రణయ్ ను హత్య చేయించాడని అమృత తండ్రిపై కేసు పెట్టింది. ఈ కేసు విచారణలో ఉండగానే అమృత తండ్రి మారుతీరావు హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి మారుతీరావును కడసారి చూసేందుకు వచ్చిన అమృతను కుటుంబ సభ్యులు అడ్డుకోగా పోలీసుల సహాకరంతో తండ్రిని చివరి చూపు చూసిన అమృత అప్పట్లో వైరల్ అయింది‌. 

అమృతకి నిహాన్ అనే కొడుకు ఉన్నాడు. తనతో కలిసి యూట్యూబ్ లో రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తూ బిజీగా ఉంటోంది అమృత. ప్రస్తుతం తను అత్తారింట్లోనే ఉండగా.. తాజాగా తన అమ్మ కూడా చూడటానికి వచ్చిందంటూ ఓ వ్లాగ్ చేసింది అమృత. దాంతో ఈ వ్లాగ్ వైరల్ గా మారింది. ఇలా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఇన్ స్పైరింగ్ లైఫ్ జర్నీ కోసమైనా తనని బిగ్ బాస్ హౌస్ లోకి తోసుకొచ్చేస్తారని నెటిజన్లు భావిస్తున్నారు. మరి నిజంగానే తను హౌస్ లోకి రానుందా లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.