English | Telugu

గ‌డ్డు ప‌రిస్థితులు.. అందుకే సోషల్ మీడియాకు దూరం.. కారణం చెప్పిన అఖిల్!

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ.. తరచూ పోస్ట్ లు పెడుతూ.. అభిమానులతో టచ్ లో ఉండే సెలబ్రిటీలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోతే.. ఏమైందా..? అంటూ అభిమానులు టెన్షన్ పడుతుంటారు. ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ ఫ్యాన్స్ కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. రోజూ ఏదొక పోస్ట్ పెడుతూ ఫ్యాన్స్ తో టచ్‌లో ఉండే అఖిల్ వారం రోజులుగా ఒక్క పోస్ట్ కానీ, స్టేటస్ కానీ పెట్టలేదు.

దీంతో ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా అఖిల్‌ను ప్రశ్నిస్తున్నారు. అలానే కొందరు కాల్స్, మెసేజ్ లు చేశారట. అయితే అసలు కారణం చెబుతూ ఇన్స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు అఖిల్. కొన్నిసార్లు మనం మరింత బలంగా తయారవ్వాలంటే కొంత సమయం దూరంగా ఉండాల్సిందేనని చెప్పాడు అఖిల్.ఎన్నో జరిగాయని.. వాటి నుండి ఎంతో నేర్చుకున్నానని.. ప్రతిరోజూ గుణపాఠమే అని చెప్పుకొచ్చాడు.

గత వారం నుండి యాక్టివ్‌గా లేనందుకు క్షమించమని అభిమానులను కోరాడు. ఇప్పుడు మళ్లీ ఫుల్ ఎనర్జీతో మీ ముందుకు వచ్చానని.. ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నానని.. ఆ కారణంగానే సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. అభిమానులను ఉద్దేశిస్తూ.. "మీరు గనుక లేకపోతే ఇంకొన్ని రోజులు ఇలానే ఉండిపోయేవాడిని." అని ఫ్యాన్స్ మీద తనకున్న ప్రేమను వ్యక్తప‌రిచాడు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.