Read more!

English | Telugu

తేజస్విని వల్లే అఖిల్ చాలా కంఫర్ట్ గా ఉన్నాడంట!

బిబి జోడి ప్రతీ శని, ఆదివారాల్లో స్టార్ మా టీవీలో ప్రసారమవుతుంది. కాగా ఈ షోకి సదా, తరుణ్ మాస్టర్, రాధ జడ్జ్ లుగా వ్యవహరిస్తుండగా శ్రీముఖి యాంకర్ గా చేస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ ప్రేక్షకుల కోసం.. ఇప్పటివరకు జరిగిన అన్ని బిగ్ బాస్ సీజన్లలోని కంటెస్టెంట్స్ తో ఈ డ్యాన్స్ షోని ఏర్పాటు చేసారు.

అయితే ఇందులో శనివారం పటాకా జోడీలు, ఆదివారం ధమాకా జోడీలు తమ పర్ఫామెన్స్ ఇస్తారు. మొదట ఫైమా-సూర్య కలిసి నాన్న- కూతురి మధ్య ఎమోషన్ బాండింగ్ తీసుకొని పర్ఫామ్ చేసారు. అది చూసాక షోలో అందరూ ఎమోషనల్ అయ్యారు. జడ్జ్ తరుణ్ మాస్టర్ కి వాళ్ళ నాన్న గుర్తొచ్చాడని చెప్పాడు. "మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నేను ఇలా ఉండటానికి మా నాన్నే కారణం. మా నాన్న నాకు రెండు విషయాలు చెప్పాడు. ఎస్ ఆర్ నో.. ఎస్ చెప్పే అవసరం వస్తే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. నో చెప్పాల్సి వస్తే ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా వెంటనే చెప్పేయాలి" అని రాధ చెప్తూ ఎమోషనల్  అయింది.

ఆ తర్వాత అఖిల్-తేజస్విని జోడి డ్యాన్స్ పర్ఫామెన్స్ చూసి రాధ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. రతీదేవి-కామదేవుడు కలిసి డ్యాన్స్ చేసినట్టుగా ఉందని, వాళ్ళిద్దరి కనెక్షన్ బాగా కుదిరిందని రాధ చెప్పుకొచ్చింది. "కంపోజిషన్ నుంచి మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ రెండు బాడీలు ఒక సోల్ లాగా బాగుంది. ఆ కలర్స్, మూమెంట్స్ అన్నీ బాగా కుదిరాయి. మీ ఇద్దరి పర్ఫామెన్స్ చూసి నాకు నోట మాట రావట్లేదు. డెఫినెట్లీ యూ పీపుల్ ఆర్ బ్యాక్. స్పీచ్ లెస్" అని సధా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తరుణ్ మాస్టర్ మాట్లాడుతూ.. "ఇద్దరి కెమిస్ట్రీ, అన్నీ బాగా కుదిరాయి. బాగుంది" అని చెప్పాడు. అయితే చివరలో‌.. తేజస్విని నీ గురించి ఒకటి చెప్పాలని రాధ తన మనసులోని మాటని బయట పెట్టేసింది. "రొమాన్స్ చేసేటప్పుడు ఇద్దరిలో అమ్మాయి ఒక స్టెప్  ముందు ఉంటూ కంఫర్ట్ ఇస్తుంది.‌ అది ఎవ్వరూ చేయలేరు.. అంత ఈజీ కాదు. తేజస్విని వల్లనే అఖిల్ చాలా కంఫర్ట్ గా ఉన్నాడు" అని రాధ చెప్పుకొచ్చింది.