English | Telugu

ఇండ‌స్ట్రీలో తెలుగువాళ్లంటే చిన్నచూపు.. ప్రశాంతి ఆవేద‌న‌!

స్టార్ మా ఛానెల్ లో ప్రసారం అవుతోన్న 'గృహలక్ష్మి' సీరియల్‌కు మంచి టీఆర్పీ వ‌స్తోంది. ఇందులో లాస్య అనే నెగెటివ్ రోల్‌లో యాంకర్ ప్రశాంతి నటిస్తున్నారు. లాస్య క్యారెక్టర్‌కు ఆమె ఆమె పెర్ఫెక్ట్ గా సూటయ్యిందనే పేరొచ్చింది. ఒకప్పుడు టీవీ ఛానెల్స్‌లో యాంకర్ గా ఆమె సత్తా చూపించారు. తెలుగింటి అమ్మాయి అయిన ప్రశాంతి.. ఇండస్ట్రీలో అవకాశాల కోసం గట్టిగానే కష్టపడ్డారు.

ఫైనల్‌గా 'గృహలక్ష్మి' సీరియల్ తో నటిగా తనను తాను నిరూపించుకున్న ప్రశాంతి తాజాగా ఇండస్ట్రీపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తెలుగు వాళ్లలో చాలా మంది టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ ఉన్నారని.. వాళ్లందరినీ ఎంకరేజ్ చేస్తే వాళ్లు ఒక్కొక్కరూ ఒక్కో ఆణిముత్యాలే అవుతారని అన్నారు. కానీ అవకాశం లేక చాలా మంది తమ టాలెంట్‌ని చంపుకుంటున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కొంతమంది అవకాశాలు లేక డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంటారని.. ఇవన్నీ ఒక్కోసారి చూస్తుంటే బాధగా అనిపిస్తుందని చెప్పుకొచ్చారు. బయట రాష్ట్రాల నుండి తెలుగు ఇండస్ట్రీకి రావాలనుకే వాళ్లను ఎంకరేజ్ చేస్తుంటారని, కానీ తెలుగు వాళ్లకు అవకాశాలు ఇవ్వరని వాపోయారు. ముందు తెలుగు వాళ్లను ప్రోత్సహించాలని.. చాలా మంది టాలెంటెడ్ వాళ్లు ఉన్నారని ప్ర‌శాంతి అన్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.