Read more!

English | Telugu

‘ఆడ జన్మకు’ పాటతో అందరిని కదిలించిన సౌజన్య!

ఓటిటి వేదిక 'ఆహా' లో స్ట్రీమ్ అవుతున్న సింగింగ్ కాంపిటీషన్ తెలుగు ఇండియన్ ఐడల్ -2. ఈ షో రోజు రోజుకి అత్యంత వీక్షకాదరణ పొందుతుంది. ఈ షోకి జడ్జ్ లుగా సింగర్స్ గీతామాధురి, కార్తిక్, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ వ్యవహరిస్తుండగా.. యాంకర్ గా హేమచంద్ర చేస్తున్నాడు. ఈ షోలోకి ఎంతో మంది కంటెస్టెంట్స్ తమలోని సత్తా నిరూపించడానికి వస్తున్నారు. అయితే వారిలో ఎవరి సింగింగ్ అయితే బాగుంటందో వారిని ఎన్నుకోవడమనేది జడ్జెస్ కి కత్తి మీద సాములా అవుతుంది. ఎందుకంటే ప్రతీ కంటెస్టెంట్ తమ గాత్రంతో అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తూ వస్తోన్నారు.

అయితే గత వారం జరిగిన ఈ షో ఎపిసోడ్ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. కారణం మంత్రి హరీశ్ రావు తన ట్విట్టర్ అకౌంట్ లో ఇండియన్ ఐడల్-2 లో పాల్గొన్న కంటెస్టెంట్ కి అభినందనలు తెలిపారు. అయితే ఇప్పుడు తాజాగా విడుదలైన ప్రోమోలో కంటెస్టెంట్ గా వచ్చిన సౌజన్య  పాడిన పాటకి షోలో ఉన్నవారందరూ ఎమోషనల్ అయ్యారు. 'ఆడ జన్మకు ఎన్ని శోకాలో' అనే పాట పాడిన సౌజన్య అందరిని తన గాత్రంతో ఆకట్టుకుంది. తన సింగింగ్ కి జడ్జెస్ ఫిదా అయిపోయారు.

సౌజన్య పాడిన ఈ పాటకి గీతామాధురి కంటతడి పెట్టుకుంది. సౌజన్య పాట పాడిన తర్వాత తన గురించి చెప్తూ.. మా పాపని వదిలి ఎప్పుడు ఉండలేను.‌ ఫస్ట్ టైం ఈ షోలో పాడటం కోసం తన పాపని వదిలి వచ్చానని చెప్పగా.‌. కాసేపటికి సౌజన్య వాళ్ళ అమ్మ పాపని తీసుకురావడంతో సౌజన్య తనని చూసి‌‌.. వెంటనే ఎత్తుకొని గుండెలకు హత్తుకుంటుంది. ఇదంతా చూసిన జడ్డెస్ ఎమోషనల్ అవుతారు. తన పాడిన పాటని ప్రతీ తల్లి-బిడ్డకి అంకితమిస్తున్నట్టు సౌజన్య చెప్పింది. తాజాగా రీలీజ్ చేసిన ఈ ప్రోమో ఆసక్తికరంగా ఉంది. దీంతో ఈ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందోనని వీక్షకులు ఎదురుచూస్తున్నారు.