Read more!

English | Telugu

రాఘవేంద్రరావు నిర్మాణంలో 'ఎద లోయల్లో ఇంద్రధనుస్సు' సీరియల్!

స్టార్ మా టీవీలో కొత్తగా ప్రారంభం అవుతున్న సీరియల్ 'ఎద లోయల్లో ఇంద్రధనస్సు'. RK ప్రొడక్షన్స్ పై కె. రాఘవేంద్రరావు ఈ సీరియల్ ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సంస్థ నిర్మించిన శాంతినివాసం, మనోయజ్ఞం, అగ్నిసాక్షి, మంగమ్మ గారి మనవరాలు వంటి సీరియల్స్ ఎంతగా పాపులర్ అయ్యాయో అందరికి తెలిసిన విషయమే. కాగా ఈ సీరియల్ మొదట 'పంతులమ్మ తెలుగమ్మాయి' అనే పేరుతో చెప్పగా.. ఇప్పుడు మరో కొత్త టైటిల్ "ఎద లోయల్లో ఇంద్రధనస్సు" అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ సీరియల్ లో ముఖ్యపాత్రలో ఏక్ నాథ్ నటిస్తున్నాడు. ఏక్ నాథ్ కి జోడిగా స్వాతి నిత్యానంద్ నటిస్తోంది. ఈమె మలయాళ నటి. మలయాళం లో చాలా సీరియల్స్ లో నటించింది. తెలుగులో స్వాతి నిత్యానంద్ కి ఇదే తొలి సీరియల్ కావడం విశేషం. 'గుప్పెడంత మనసు' సీరియల్ ఫేమ్ సాక్షి అలియాస్ రసజ్ఞ ఈ సీరియల్ లో ఏక్ నాథ్ కి సోదరిగా నటిస్తుంది. సీనియర్ యాక్టర్ రాజ్ కుమార్..  స్వాతికి మేనమామ పాత్రలో చేస్తున్నారు. ఈ సీరియల్ బెంగాలీ సీరియల్ కి రీమేక్ గా వస్తుంది. అయితే ఈ సీరియల్ కథ 'గుప్పెడంత మనసు' సీరియల్ కథకు దగ్గరగా ఉంటుందని తెలుస్తుంది. గుప్పెడంత మనసు సీరియల్ లో కాలేజీ ఏండి గా రిషి, కాలేజీ స్టూడెంట్ గా వసుధార.. వాళ్లిద్దరి మధ్యలో సాగే ప్రేమకథ అత్యంత వీక్షకాదరణ పొందుతున్న విషయం తెలిసిందే. 'ఎదలోయల్లో ఇంద్రధనస్సు' సీరియల్ లో ముఖ్య పాత్రను పోషిస్తున్న ఏక్ నాథ్ స్కూల్ ఎండీగా, స్వాతి స్కూల్ టీచర్ గా చేస్తుందని సీరియల్ ప్రోమోని చూస్తే తెలుస్తుంది. 

స్టార్ మా టీవీలో ఈ సీరియల్ ని 'గుప్పెడంత మనసు' సీరియల్ స్లాట్ టైంలో ప్రసారం చేసి.. గుప్పెడంత మనసుని ఇంకా ముందు స్లాట్ లో ప్రసారం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ కొత్త సీరియల్ గుప్పెడంత మనసు సీరియల్ ని బీట్ చేస్తుందో లేదో చూడాలి మరి.