English | Telugu

Karthika Deepam 2: జ్యోత్స్నకి కార్తీక్ వార్నింగ్.. కాశీ కోసం పారిజాతం తపన!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -555 లో... కార్తీక్, జ్యోత్స్న స్టేషన్ కి బయల్దేరతారు. కార్తీక్ మధ్యలో కార్ ఆపుతాడు. జ్యోత్స్నని దిగమని చెప్తాడు. ఏంటి బావ ఇక్కడ అపావని జ్యోత్స్న అడుగుతుంది. దీనంతంటికి కారణం జ్యోత్స్ననే అని కార్తీక్ ఇండైరెక్ట్ గా మాట్లాడుతాడు. నువ్వు ఏం అంటున్నావో నాకు అర్థం అయింది బావ కానీ శివన్నారాయణకి ఏకైక వారసురాలిని నేను.. ఇలా నా రెస్టారెంట్ గురించి ఎందుకు చేసుకుంటానని జ్యోత్స్న అంటుంది.

నువ్వు అని ఎవరు చెప్పారని కార్తీక్ అనగానే జ్యోత్స్న ఒక్కసారిగా టెన్షన్ పడుతుంది. అంటే నువ్వు అలా ఫీల్ అవ్వడం లేదుగా అని కార్తీక్ అంటాడు. నేను అనుకోకపోవడం ఏంటని జ్యోత్స్న అంటుంది. నాకు కాశీ అంత చెప్పాడు.. వైరా, కాశీ ఫోన్ రికార్డింగ్ చూస్తే నీ పరిస్థితి ఏంటి మళ్ళీ అత్తకి లేనిపోని టెన్షన్ ఎందుకని వదిలేస్తున్న ఇక మీదుట అసలు ఊరుకోనని జ్యోత్స్నకి కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు.

ఆ తర్వాత ఇద్దరు స్టేషన్ కి వెళ్తారు. శ్రీధర్ ని స్టేషన్ నుండి వదిలేస్తారు. వైరా, కాశీని సెల్లో వేస్తారు. నిన్ను నా కొడుకు అనుకుని దగ్గర ఉంచుకుని అన్నీ నేర్పించి నీ చేత సొంతంగా రెస్టారెంట్ పెట్టిద్దామనుకున్న కానీ ఇలా వెన్నుపోటు పొడుస్తావనుకోలేదని కాశీతో శ్రీధర్ చెప్తూ ఎమోషనల్ అవుతాడు.

ఆ తర్వాత శివన్నారాయణ దగ్గరికి శ్రీధర్ వెళ్లి మావయ్య గారు నన్ను క్షమించండి అని అంటాడు. నువ్వు ఏం తప్పు చెయ్యలేదు మన సంస్థని కాపాడడానికి కార్తీక్ ఉన్నాడుగా అని శివన్నారాయణ మురిసిపోతాడు. కాశీని తీసుకొని రాలేదని పారిజాతం కోప్పడుతుంది. మీకు ఒక్కరికే తనపై బాధ్యత ఉన్నట్లు మాట్లాడకండి అని పారిజాతంపై దీప కోప్పడుతుంది. అనవసరంగా కాశీనీ ఇందులో లాగింది ఈ జ్యోత్స్ననే.. దీని సంగతి చెప్తానని పారిజాతం అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.