Read more!

English | Telugu

Guppedantha Manasu : మను తండ్రి మహేంద్రే అని చెప్పేసిన పెద్దావిడ.. షాక్ లో వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1057 లో.. అనుపమతో వసుధార మాట్లాడుతుంటుంది. కావాలనే అనుపమని వసుధార రెచ్చగొడుతుంది. మను తండ్రి లేడంటే చెప్పేవారు కదా అని వసుధార పదేపదే అంటుంది. అప్పుడే అనుపమ వాళ్ళ పెద్దమ్మ వచ్చి.. మను తండ్రి బ్రతికే ఉన్నాడని అంటుంది. దాంతో అనుపమ, వసుధార ఇద్దరు షాక్ అవుతారు. మరి మనుకి తండ్రి ఉంటే మావయ్య దత్తత తీసుకోవడానికి అనుపమ ఎందుకు ఒప్పకుంది. అసలు నిజం ఎందుకు చెప్పడం లేదని వసుధార అడుగుతుంది.

నిజం చెప్పకపోవడానికే తన కారణాలు తనకి ఉంటాయి కదా అని పెద్దావిడ అంటుంది. మరి దత్తతకి ఎందుకు ఒప్పుకుందని వసుధార అనగానే.. ఎందుకు అంటే దత్తత తీసుకునేది మను తండ్రే కాబట్టి అని ఆ పెద్దావిడ అనగానే అందరు షాక్ అవుతారు. అవును మను తండ్రి మహేంద్రనే అని ఆ అనుపమ వాళ్ళ పెద్దమ్మ అనగానే.. వసుధార షాక్ అవుతుంది. మీరేం అంటున్నారో అర్థం కావడం లేదని వసుధార అంటుంది. ఇందులో అనుపమ తప్పేం లేదని, ఇదే నిజమని ఆమె అంటుంది. అప్పుడే మహేంద్ర వస్తాడు‌. ఏదో నిజం అంటున్నారు? ఏంటని అడుగుతాడు. వసుధార తడబడుతు మను తండ్రి మీరే అని అంటున్నారని వసుధార అనగానే.. అదే విషయం ఆ రోజు నేనే చెప్పాను కదా అని మహేంద్ర అంటాడు. ఆ విషయం నిజం చెయ్యడానికే దత్తత తీసుకుంటున్నానని మహేంద్ర అంటాడు. వసు నిజం చెప్పడానికి ట్రై చేస్తుంటే.. అనుపమ వద్దని సైగ చేస్తుంది.

ఆ తర్వాత దేవయాని దత్తత గురించి మహేంద్రని తిడుతుంటుంది. మహేంద్ర గురించి నెగెటివ్ గా ఎందుకు మాట్లాడుతున్నావని దేవయానిపై ఫణీంద్ర కోప్పడతాడు. ఆ తర్వాత మహేంద్రకి శైలేంద్ర ఫోన్ చేస్తాడు. మీతో ఒక విషయం మాట్లాడాలని నేను చెప్పిన చోటుకి రండి అని శైలేంద్ర చెప్పగా.. మహేంద్ర రానని అంటాడు... ఆ తర్వాత శైలేంద్ర ఇబ్బంది పెడుతుంటే మహేంద్ర వస్తానంటాడు. మరొకవైపు మావయ్య మను తండ్రి ఏంటని వసుధార ఆలోచిస్తూ‌.. అనుపమ గారి పెద్దమ్మని అడిగి తెలుసుకోవాలనక అనుకుంటుంది. అపుడే వసుధారకి ఏంజిల్ ఫోన్ చేసి.. మహేంద్ర గారు మను ని దత్తత తీసుకుంటున్నారంటగా అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.