ఎక్స్ట్రా జబర్దస్త్ కంపెనీ క్లోజ్... రోడ్డున పడ్డ కమెడియన్స్!
2013 నుంచి జబర్దస్త్ 2014 నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాయి.. అప్పట్లో గురు, శుక్రవారం వచ్చిదంటే చాలు అందరూ టీవీల ముందు కూర్చుని కమెడియన్స్ స్కిట్స్ కి కడుపుబ్బా నవ్వుకునే వాళ్ళు. ఈ రెండు కామెడీ షోస్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ పరిచయం అయ్యారు. సుధీర్, రష్మీ, ఆటో రాంప్రసాద్, ఆది లాంటి వాళ్ళు ఎంతో మందికి ఉపాధితో పాటు ఒక స్పెషల్ ఐడెంటిటీని కూడా ఈ రెండు షోస్ ఇచ్చాయి. వీళ్ళు ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్నారు...సిల్వర్ స్క్రీన్ మీద కూడా హీరోస్ గా, రైటర్స్ గా, డైరెక్టర్స్ గా వెలుగుతున్నారు.