Read more!

English | Telugu

వింటేజ్ శ్రీను వైట్ల వస్తున్నాడు.. కొత్త మీమ్స్ కి రెడీ అయిపోండి!

ఒకప్పుడు దర్శకుడు శ్రీను వైట్ల(Srinu Vaitla) సినిమాలకు ఎంతో క్రేజ్ ఉండేది. కామెడీ ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా ఆయన పేరు చెప్పుకునేవారు. 'సొంతం', 'వెంకీ', 'ఢీ', 'రెడీ', 'దూకుడు', 'బాద్‍షా' ఇలా ఎన్నో ఆల్ టైం ఎంటర్టైనర్స్ ని శ్రీను వైట్ల అందించారు. సోషల్ మీడియాలో కనిపించే తెలుగు మీమ్స్ లో 80 శాతం ఆయన సినిమాల్లోని టెంప్లేట్స్ కనిపిస్తాయి. అలాంటి వైట్ల.. 'ఆగడు' తర్వాత వరుస పరాజయాలతో వెనకబడిపోయారు. 2018 లో వచ్చిన 'అమర్ అక్బర్ ఆంటోని' తర్వాత ఆయన నుంచి సినిమా రాలేదు. ఆరేళ్ళ గ్యాప్ తర్వాత ఇప్పుడు శ్రీను వైట్ల మళ్ళీ తన మార్క్ చూపించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ తో 'విశ్వం' సినిమా చేస్తున్న ఆయన.. ఇప్పుడు మరో సినిమాని కూడా లైన్ లో పెట్టినట్లు సమాచారం.

హీరో రామ్ పోతినేని(Ram Pothineni), శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన 'రెడీ'(2008) మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. థియేటర్లలో నవ్వులు పూయించి, కాసులు వర్షం కురిపించింది. పలు భాషల్లో రీమేక్ కూడా అయింది. ఇప్పటికీ ఈ సినిమాని రిపీటెడ్ గా చూసేవారు ఎందరో ఉన్నారు. అలా 'రెడీ'తో నవ్వుల సునామీ సృష్టించిన రామ్-వైట్ల కాంబో మరోసారి చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీను వైట్ల స్టోరీ లైన్ చెప్పడం, దానికి రామ్ ఇంప్రెస్ అవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. 'విశ్వం' సినిమా పూర్తయ్యాక.. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని వైట్ల మొదలుపెడతారట. 'రెడీ' కాంబోలో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో రూపొందనుందని తెలుస్తోంది.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'డబుల్ ఇస్మార్ట్'(Double iSmart) చేస్తున్నాడు రామ్. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. దీని తర్వాత వైట్ల ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.