English | Telugu
ఫిభ్రవరి 26న ‘వీరి వీరి గుమ్మడిపండు’
Updated : Feb 22, 2016
దుగ్గిన్ సమర్పణలో శివకృతి క్రియేషన్స్ బ్యానర్పై రుద్ర, వెన్నె, సంజయ్, బంగారం ప్రధానతారాగణంగా రూపొందిన చిత్రం ‘వీరి వీరిగుమ్మడిపండు’. ఎం.వి.సాగర్ దర్శకత్వంలో కెల్లం కిరణ్కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిభ్రవరి 26న విడుదలవుతుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు ఎం.వి.సాగర్, నిర్మాత కెల్లం కిరణ్ కుమార్, హీరో రుద్ర, హీరోయిన్ వెన్నెల, రుశ్వేత, హార్డికేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
దర్శకుడు ఎం.వి.సాగర్ మాట్లాడుతూ ‘‘ఫ్యామిలీ హర్రర్ ఎంటర్టైనర్. ప్యాడిరగ్ ఆర్టిస్టులు కొంత మంది మినహా 63 మంచి కొత్తవాళ్ళే ఈ సినిమాకు పనిచేశారు. హీరో రుద్రనే సంగీత దర్శకుడు పి.ఆర్ను పరిచయం చేశారు. పి.ఆర్. మంచి సంగీతాన్నందించారు. ప్రేమకథాచిత్రమ్, గీతాంజలి, రాజుగారి గది చిత్రాల తరహాలో ఈ ఏడాది వీరివీరి గుమ్మడిపండు సినిమా పెద్ద సక్సెస్ సాధిస్తుంది. సినిమా ఫిభ్రవరి 26న విడుదలవుతుంది. తప్పకుండా సినిమాను ఆదరిస్తారని నమ్ముతున్నాం’’ అన్నారు. నిర్మాత కెల్లం కిరణ్కుమార్ మాట్లాడుతూ ‘‘సినిమా అంటే ప్యాషన్ ఉన్న యూనిట్ ఈ సినిమా కోసం వర్క్ చేసింది. సినిమా బాగా వచ్చింది. సినిమా ఫిభ్రవరి 26న విడుదల చేస్తున్నాం. తప్పకుండా డిఫరెంట్ ఎంటర్టైనర్గా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.