Read more!

English | Telugu

వరుణ్ సందేష్ కొత్త మూవీ నేరుగా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!


ఈ మధ్యకాలంలో క్రైమ్ సస్పెన్స్ డ్రామా, థ్రిల్లర్ సినిమాలకి క్రేజ్ పెరిగింది. అందుకేనేమో ఆ మధ్య నాగచైతన్య చేసిన 'దూత' వెబ్ సిరీస్ అంత హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ' ఇన్ స్పెక్టర్ రిషి' కి భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది. 

అందుకేనేమో దర్శక, నిర్మాతలు కామెడీ, డ్రామా జానర్ సినిమాలకంటే థ్రిల్లర్ జానర్ సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.  వరుణ్ సందేష్ నటించిన క్రైమ్ సస్పెన్స్ డ్రామా " చిత్రం చూడరా". ఈ సినిమా టైటిల్ పోస్టర్ ని తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్ సందేష్ కి జంటగా శీతల్ భట్ నటించింది. ఈ సినినాలో ధనరాజ్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కొత్త బంగారులోకం, హ్యాపీ డేస్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న వరుణ్  సందేష్ ..  ఆ తర్వాత సరైన హిట్ లు లేక కామ్ అయ్యాడు. అయితే తన భార్య వితికతో కలిసి బిగ్ బాస్ లోకి వెళ్ళాక వారిద్దరి మీద తెగ ట్రోల్స్ వచ్చాయి. బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక వారిద్దరికి కాస్త క్రేజ్ పెరిగింది‌ కానీ సినిమా అవకాశాలు రాలేదనే చెప్పాలి.  అయితే ఈ క్రైమ్ సస్పెన్స్ డ్రామా సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. 

అయితే ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతుందని.. ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవి విన్ లో మే 9 నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో వరుణ్ సందేష్ ఎవరికి భయపడని వ్యక్తిలా కన్పిస్తుంటే పక్కనే ఉన్న ధనరాజ్ భయంభయంగా కూర్చొని ఉన్నాడు. దీంతో ఏదో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వీరిని పోలీస్ స్టేషను కి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రవిబాబు పోలీస్ ఆఫీసర్ గా కన్పించబోతున్నాడు.